News October 24, 2024

తూ.గో జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

image

తూ.గో జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన తేదీ ఖరారైంది. ఈనెల 26 కాకినాడ, అమలాపురం, రాజమండ్రిలో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాలలోని కాంగ్రెస్ నేతలతో సమావేశమవ్వనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో పార్టీ పటిష్ఠత గురించి నేతలతో చర్చించనున్నారు.

Similar News

News November 24, 2025

టెన్త్ పరీక్షల‌పై సందేహాలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్: DEO

image

2026 మార్చి 16 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి నామినల్ రోల్స్‌ను ప్రధానోపాధ్యాయులు నిశితంగా పరిశీలించాలని డీఈవో కంది వాసుదేవరావు సూచించారు. పాఠశాల యూ-డైస్‌ డేటాతో సరిచూసుకుని, దోషరహితంగా ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలన్నారు. ఏమైనా సందేహాలుంటే నివృత్తి కోసం జిల్లాస్థాయి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని, అసిస్టెంట్ కమిషనర్ ఎం.అమలకుమారిని 9849939487 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

News November 24, 2025

టెన్త్ పరీక్షల‌పై సందేహాలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్: DEO

image

2026 మార్చి 16 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి నామినల్ రోల్స్‌ను ప్రధానోపాధ్యాయులు నిశితంగా పరిశీలించాలని డీఈవో కంది వాసుదేవరావు సూచించారు. పాఠశాల యూ-డైస్‌ డేటాతో సరిచూసుకుని, దోషరహితంగా ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలన్నారు. ఏమైనా సందేహాలుంటే నివృత్తి కోసం జిల్లాస్థాయి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని, అసిస్టెంట్ కమిషనర్ ఎం.అమలకుమారిని 9849939487 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

News November 23, 2025

సమస్య మీది.. పరిష్కారం మాది: తూ.గో కలెక్టర్

image

ఈనెల 24న కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల, గ్రామ, వార్డు సచివాలయాల వద్ద PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. అర్జీదారులు తమ విజ్ఞప్తులను ముందుగానే ఆన్‌లైన్‌లో Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీల స్థితి, ఇతర వివరాలు తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేసి సమాచారం పొందవచ్చన్నారు. స్వీకరించిన అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.