News April 25, 2024

తూ.గో జిల్లా: మాజీ సైనికులకు పథకాల రిజిస్ట్రేషన్

image

తూ.గో జిల్లా మాజీ సైనికులకు, సైనిక సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే వివిధ పథకాలు, ప్రయోజనాలను పొందేలా దరఖాస్తు చేసుకునేందుకు ap.sainic.com వెబ్ సైట్ ను రూపొందించినట్లు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి కృష్ణారావు తెలిపారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని మాజీ సైనికులు, మాజీ సైనిక వితంతువులు వారి వివరాలను తప్పనిసరిగా ఈ వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

Similar News

News January 19, 2025

తూ.గో: 20వ తేదీన యథావిధిగా పీజిఆర్ఎస్

image

ఈనెల 20వ తేదీన సోమవారం రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలందరూ గమనించాలని సూచించారు.

News January 18, 2025

రాజమండ్రి: 19 అంగుళాల దూడ.. చూడటానికి జనం ఆసక్తి

image

ఆవుకు 19 అంగుళాల చిన్నిదూడ పుట్టింది.‌ దీంతో ప్రజలు ఆ దూడని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలోని అగ్రహారంలో తాడల సాయి శ్రీనివాస్‌ ఎంబీఏ చదువుకొని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సాయికి మూగ జీవాలపై ఉన్న ప్రేమతో గత 3 సంవత్సరాల నుంచి తన ఇంట్లో పుంగనూరు జాతికి చెందిన ఆవును పెంచుకుంటున్నాడు. శనివారం ఆ ఆవు 19 అంగుళాల దూడకు జన్మనిచ్చింది. చిన్నగా చూడచక్కగా ఉంది.

News January 18, 2025

రాజమండ్రి: పీఎం ఇంటర్న్ షిప్ గోడపత్రికలు ఆవిష్కరణ

image

ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ ద్వారా రాబోయే ఐదేళ్లలో దేశంలోని టాప్ 500 కంపెనీలలో కోటి మంది యువతకు నైపుణ్యంతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. శనివారం రాజమండ్రి కలెక్టర్ ఛాంబర్‌లో పీఎం ఇంటర్న్ షిప్ పథకం గోడ ప్రతులను జిల్లా పరిశ్రమల అధికారి రామన్, సహాయ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, నైపుణ్య అభివృద్ధి అధికారి పెరుమాళ్ళరావుతో ఆవిష్కరించారు.