News February 4, 2025
తూ.గో: నగ్నా చిత్రాలు పేరుతో రూ.2.53 కోట్లు స్వహ

ఆశ్లీల వీడియోల పేరుతో బెదిరించి నిడదవోలు శాంతి నగర్కు చెందిన యువతి నుంచి రూ.2.53 కోట్లు కాజేసిన నినావత్ దేవనాయక్ను గుంటూరులో అరెస్ట్ చేసినట్లు సీఐ తిలక్ సోమవారం విలేకరులకు తెలిపారు. యువతి HYD విప్రోలో ఉద్యోగం చేస్తోంది. తన వద్ద యువతి నగ్న చిత్రాలు ఉన్నాయని వాటిని ఇంటర్నెట్లో పెట్టకుండా ఉండాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేశాడన్నారు. నిందితుడి నుంచి 1.84 నగదు, స్థిరాస్తులను సీజ్ చేశామన్నారు.
Similar News
News February 11, 2026
ఫీజు రీయింబర్స్మెంట్: కాలేజీల ఖాతాల్లోకే..

AP: నిన్న విడుదలైన రూ.1,200 కోట్ల <<19104256>>ఫీజు<<>> రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం కాలేజీల ఖాతాల్లో జమ చేయనుంది. దీంతో 2024-25 బకాయిలు క్లియర్ కానున్నాయి. అయితే 2023-24కు సంబంధించి రూ.1,500 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఈ నిధులను తల్లుల ఖాతాల్లోనే జమ చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కోర్సులు పూర్తి చేసుకొని వెళ్లిపోయిన వారినుంచి డబ్బులు ఎలా రాబట్టుకోవాలని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి.
News February 11, 2026
ఎయిర్పోర్ట్ నిర్మాణం అక్కడేనా?

అనంతపురం జిల్లాలో కార్గో విమానాశ్రయ ఏర్పాటుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకు సుమారు 1,200 ఎకరాల భూమిని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో మంగళవారం కుడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద భూములను ఆర్డీవో కేశవ నాయుడు పరిశీలించారు. అనంతపురం సరిహద్దులోని కుడేరు మండలం, రాప్తాడు నియోజకవర్గంలోని కొంత భాగంలో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కానున్నట్లు సమాచారం.
Photo: AI
News February 11, 2026
ఎన్నికలకు 750 మంది పోలీసు బందోబస్తు: డీసీపీ

జనగామ, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ ఎన్నికలకు మొత్తం 750 మంది పోలీస్ బందోబస్తును నియమించినట్లు జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. రెండు చోట్ల అదనపు ఎస్పీతో పాటు ఏఎస్పీ, ఏసీపీ, సీఐలు 7, ఎస్సైలు 32 మంది, పోలీస్ కానిస్టేబుళ్లతో పాటు బీఎస్ఎఫ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సైతం ఎన్నికల విధుల్లో ఉంటారని పేర్కొన్నారు.


