News February 14, 2025
తూ.గో: నామినేషన్లు విత్ డ్రా చేసుకుంది వీరే..

గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 35 మంది నిలిచారు. మొత్తం 54 మంది నామినేషన్ వేయగా అధికారులు 11 మంది నామినేషన్లను తిరస్కరించారు. అందులో 8 మంది విత్ డ్రా చేసుకున్నారు. 35 మంది బరిలో నిలిచారు. పిల్లంగొళ్ల లీలా నగేశ్, విజయలక్ష్మీ, కవల నాగేశ్వరరావు, పచ్చిగోళ్ల దుర్గారావు, పేరాబత్తుల సత్యవాణి, గండుమోలు బాలాజీ, సత్తి రాజు స్వామి, కోండ్రు చక్రపాణి విత్ డ్రా చేసుకున్నారు.
Similar News
News December 19, 2025
వాజేడు: నాలుగు కాళ్ల కోడి పిల్ల

వాజేడు మండలం గుమ్మడిదొడ్డిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు ఇంట్లో నాలుగు కాళ్లతో ఉన్న కోడి పిల్ల బయటకు వచ్చింది. అదే కోడి గుడ్ల నుంచి పుట్టిన మిగతా కోడి పిల్లలు సాధారణంగానే ఉండగా, ఒక్క పిల్ల మాత్రం 4 కాళ్లతో కనిపించడంతో గ్రామస్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. పలువురు తమ ఫోన్లలో దృశ్యాన్ని బంధించారు.
News December 19, 2025
అనకాపల్లి: 14,559 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళిక

అనకాపల్లి జిల్లాలో 2025-26 రబీ సీజన్లో 14,559 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళికను సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి శుక్రవారం తెలిపారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 8,824 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 7,898 టన్నుల యూరియాను అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెలాఖరులోగా మరో 926 టన్నుల యూరియా జిల్లాకు రానున్నట్లు చెప్పారు. నానో ఎరువులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.
News December 19, 2025
కాకినాడ: వాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’లో FIR డౌన్లోడ్ సౌకర్యం- SP

పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే FIR ప్రతిని పొందవచ్చని కాకినాడ జిల్లా SP బిందుమాధవ్ తెలిపారు. జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ మేరకు సూచనలు జారీ చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’లో FIR డౌన్లోడ్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ సేవల ద్వారా ప్రజలకు సమయం ఆదా కావడంతో పాటు, పోలీస్ సేవల్లో మరింత పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.


