News January 4, 2025

తూ.గో: నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

image

జిల్లాలో 15 జూనియర్ కళాశాలలో శనివారం నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి ఓ ప్రకటనలో తెలిపారు. స్ధానిక జిల్లా మంత్రి దుర్గేష్, ఇతర ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న 5,425 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నారు.

Similar News

News January 25, 2025

రాజానగరం: హత్య కేసులో వ్యక్తికి జీవిత ఖైదు

image

రాజానగరంలోని రథేయపాలేనికి చెందిన రాంబాబుకు హత్య కేసుకు సంబంధించి జీవిత ఖైదు విధిస్తూ రాజమండ్రి 5వ అదనపు కోర్టు తీర్పు వెలువరించింది. రాజానగరం సీఐ కథనం.. రాంబాబు 2020లో అదే గ్రామానికి చెందిన వెంకన్నను హత్య చేసి, వెంకన్న బాబును గాయపరిచాడు. ఆ ఘటనకు అప్పటి ఎస్సై నాగబాబు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణల అనంతరం శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించింది.

News January 25, 2025

రాజమండ్రి : మహిళను వేధించి హత్యాయత్నం.. జైలు

image

కాకినాడలోని వాకలపూడి వాసి వెంకన్న (25)కు రాజమండ్రి 8వ జిల్లా సెషన్స్ జడ్జి 9ఏళ్ల జైలు, రూ. 7 వేలు జరిమానా విధించారు. కాగా నిందితుడు ఓ మహిళను లైంగికంగా వేధించి , హత్యాయత్నం చేశాడని 2022లో అప్పటి ఎస్సై వి. మౌనిక కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించింది.

News January 25, 2025

నేడు రాజమండ్రి విమనాశ్రయానికి టెక్నికల్ టీం రాక

image

రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌లో నూతన టెర్మినల్ భవనం నిర్మాణంలో శుక్రవారం మిషనరీ పనులు నిర్వహిస్తుండగా క్రేన్ ద్వారా అమరుస్తున్న పిల్లర్ సెట్టింగ్ జారిపడి విషయం విధితమే. ఇద్దరికీ స్వల్పగాయాలయ్యాయని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ జ్ఞానేశ్వరరావు తెలిపారు. ప్రమాదానికి కారణాలను అంచనాలు వేసేందుకు చెన్నై, హైదరాబాద్ టెక్నికల్ టీమ్స్ శనివారం వస్తున్నట్టు తెలిపారు. ప్రమాదంలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తారని తెలిపారు.