News April 11, 2025
తూ.గో: నేడు పిడుగులతో కూడిన వర్షాలు

తూ.గో జిల్లాలో శుక్రవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వాతావరణంలో మార్పులు రైతులను కలవర పెడుతున్నాయి. NOTE: పిడుగులు పడేటప్పుడు చెట్ల కింద ఉండకండి.
Similar News
News January 3, 2026
గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం

కొవ్వూరు ఎరినమ్మ ఘాట్ వద్ద శనివారం గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పట్టణ సీఐ పీ. విశ్వం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడికి సుమారు 60 ఏళ్లు పైబడి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతుడి వద్ద ఏ విధమైన ఆధారాలు లభ్యం కాలేదన్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు 9440796622కు కాల్ చేయాలన్నారు.
News January 3, 2026
ఈ నెల 3న రాజమండ్రిలో పర్యటించనున్న కమిషన్ చైర్పర్సన్

ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ జనవరి 3న తూ.గో జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారులు శుక్రవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 8.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి రోడ్డుమార్గం ద్వారా బయలుదేరి 11 గంటలకు రాజమండ్రి చేరుకుంటారన్నారు. 12 గంటలకు రాజమండ్రిలో నిర్వహించనున్న ‘మహిళా విద్యావేత్తల సాధికారత –వృత్తి & వ్యక్తిగత సమతుల్యత’ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.
News January 3, 2026
ఈ నెల 3న రాజమండ్రిలో పర్యటించనున్న కమిషన్ చైర్పర్సన్

ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ జనవరి 3న తూ.గో జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారులు శుక్రవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 8.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి రోడ్డుమార్గం ద్వారా బయలుదేరి 11 గంటలకు రాజమండ్రి చేరుకుంటారన్నారు. 12 గంటలకు రాజమండ్రిలో నిర్వహించనున్న ‘మహిళా విద్యావేత్తల సాధికారత –వృత్తి & వ్యక్తిగత సమతుల్యత’ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.


