News February 27, 2025

తూ.గో: నేడే MLC ఎలక్షన్.. సర్వం సిద్ధం

image

ఉమ్మడి తూ.గో.జిల్లాలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద అధికార యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసింది. దీంతో పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉండనుంది. గోదావరి జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. 70 జోన్లలో 70 జోనల్ అధికారులు, 95మంది రూట్ ఆఫీసర్లను నియమించారు.

Similar News

News December 9, 2025

నేషనల్ కెమికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

image

పుణేలోని CSIR-నేషనల్ కెమికల్ లాబోరేటరీలో 34 టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12 నుంచి జనవరి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. టెక్నీషియన్‌కు నెలకు రూ.40వేలు, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.72,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: http://recruit.ncl.res.in/

News December 9, 2025

చంద్రబాబు ఎప్పటికీ రైతు వ్యతిరేకే: పేర్ని నాని

image

AP: వ్యవసాయం, ధాన్యాగారంగా APకి ఉన్న బ్రాండును దెబ్బతీసింది CM చంద్రబాబేనని మాజీమంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రైతును గుడ్డికన్నుతో చూడటం చంద్రబాబు విధానం. ఆయన ఎప్పటికీ రైతు వ్యతిరేకే. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు. 18నెలల్లోనే రూ.2.66లక్షల కోట్ల అప్పుచేశారు. అప్పులు తెచ్చి ఎక్కడ పెడుతున్నారు? దేశ GDPలో AP వాటా ఎంత?’ అని ప్రశ్నించారు.

News December 9, 2025

ప్రకాశం డీఈవో కిరణ్ కుమార్ బదిలీ

image

ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఈవోల సాధారణ బదిలీలలో ప్రకాశం జిల్లా డీఈవో కిరణ్ కుమార్ గుంటూరు జిల్లా బోయపాలెం డైట్ కళాశాలకు బదిలీ కాగా, ఆయన స్థానంలో గుంటూరు జిల్లా డీఈవో సీవీ రేణుక నియమితులయ్యారు. త్వరలోనే ప్రకాశం డీఈవోగా రేణుక బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.