News November 2, 2024

తూ.గో: పోలవరం పై మంత్రి సుభాష్ కీలక వ్యాఖ్యలు

image

పోలవరం ప్రాజెక్ట్ పై గత వైసీపీ ప్రభుత్వ పనితీరుపై మంత్రి సుభాష్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రామచంద్రపురం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..గత జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయన్నారు. A అంటే అమరావతి, P అంటే పోలవరం నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు.

Similar News

News January 6, 2026

పోలీసుల ‘వాట్సాప్’ నంబర్ ఇదే.. సేవ్ చేసుకోండి!

image

ప్రజలు పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండానే సేవలు పొందేలా ప్రభుత్వం ‘వాట్సాప్ గవర్నెన్స్’ను అందుబాటులోకి తెచ్చిందని ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. ప్రజలు తమ మొబైల్స్‌లో 9552300009 నంబరును సేవ్ చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా ఈ-చలాన్ చెల్లింపు, ఎఫ్.ఐ.ఆర్ (FIR) కాపీలు, కేసు దర్యాప్తు స్థితిగతులను సులభంగా తెలుసుకోవచ్చన్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని ప్రజలు సమయాన్ని ఆదా చేసుకోవాలని ఎస్పీ కోరారు.

News January 5, 2026

తూ.గో: పోలీసు పీజీఆర్ఎస్‌కు 26 ఆర్జీలు

image

తూ.గో. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కు 26 ఆర్జీలు వచ్చినట్లు ఎస్పీ డి.నరసింహకిశోర్‌ తెలిపారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులపై చట్టపరిధిలో విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం వహించరాదని స్పష్టం చేశారు.

News January 5, 2026

RJY: నేడు కలెక్టరేట్‌లో ‘రెవెన్యూ క్లినిక్’

image

తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్‌తో పాటు ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై. మేఘస్వరూప్ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని తహశీల్దార్లు, కంప్యూటర్ ఆపరేటర్లు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. మండల స్థాయిలో డిప్యూటీ తహశీల్దార్లు PGRS నిర్వహిస్తారని స్పష్టం చేశారు. భూసంబంధిత సమస్యల పరిష్కారానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు.