News May 19, 2024
తూ.గో.: భార్యతో వాగ్వాదం.. భర్త SUICIDE

HYDలోని బోరబండకు చెందిన నల్లమాటి సాయికుమార్(29)కు మూడేళ్ల క్రితం వివాహమైంది. కాగా ఈ నెల 9న ఏపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు భార్య రాజమండ్రికి వెళ్లింది. కాగా 17వ తేదీన సాయికుమార్ భార్యకు ఫోన్ చేసి త్వరగా రావాలని కోరాడు. ఈ క్రమంలో ఇద్దరిమధ్య మాటామాట పెరిగింది. దీంతో మనస్తాపానికి గురైన సాయికుమార్ ఇంట్లో ఉరేసుకొని చనిపోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదుమేరకు బోరబండ పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.
Similar News
News November 25, 2025
తూ.గోలోకి కాదు.. కొత్త జిల్లానే!

వైసీపీ ప్రభుత్వంలో తూ.గో, కాకినాడ, కోనసీమ, అల్లూరి జిల్లాలుగా ఏర్పాటైన విషయం తెలిసిందే. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలు జిల్లా కేంద్రం పాడేరుకు దూరంగా ఉన్నాయి. దీంతో రంపచోడవరం తిరిగి తూ.గోలో కలిపితే జనాభా 10లక్షలు దాటుతుందని అంచనా. ఇదే జరిగితే మరోసారి తూ.గోజిల్లా పెదద్ది అవుతుంది. అలా కాకుండా చింతూరు, రంపచోడవరం డివిజన్లు కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై నేడు సీఎం చర్చిస్తారని సమాచారం.
News November 25, 2025
తూ.గోలోకి కాదు.. కొత్త జిల్లానే!

వైసీపీ ప్రభుత్వంలో తూ.గో, కాకినాడ, కోనసీమ, అల్లూరి జిల్లాలుగా ఏర్పాటైన విషయం తెలిసిందే. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలు జిల్లా కేంద్రం పాడేరుకు దూరంగా ఉన్నాయి. దీంతో రంపచోడవరం తిరిగి తూ.గోలో కలిపితే జనాభా 10లక్షలు దాటుతుందని అంచనా. ఇదే జరిగితే మరోసారి తూ.గోజిల్లా పెదద్ది అవుతుంది. అలా కాకుండా చింతూరు, రంపచోడవరం డివిజన్లు కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై నేడు సీఎం చర్చిస్తారని సమాచారం.
News November 25, 2025
నిడదవోలు రానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

నిడదవోలు పురపాలక సంఘం వజ్రోత్సవ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ సోమవారం ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన నిడదవోలు మున్సిపాలిటీ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. గణపతి సెంటర్లో జరిగే ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తారని మంత్రి వెల్లడించారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.


