News January 28, 2025

తూ.గో: మార్చి నాటికి 3,823 గృహాల పూర్తి 

image

జిల్లాలో మార్చి నాటికి 3823 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులకు సూచించారు. కలెక్టర్ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ఇప్పటి వరకూ 435 పూర్తి చేశారని, కొవ్వూరు, అనపర్తి, చాగల్లు, సీతానగరం మండలాల్లో తక్కువ ప్రగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పల్లెపండుగ ద్వారా 667 సీసీ రోడ్లు లక్ష్యం కాగా, 493 పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు.

Similar News

News December 7, 2025

తూ.గో: గగనతలంలో ‘తూర్పు’ ఆశలు!

image

నేడు ‘అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం’. ఈ నేపథ్యంలో తూ.గో. వాసుల ఆకాంక్షలు బలంగా వినిపిస్తున్నాయి. మధురపూడి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించాలన్నది ప్రజల చిరకాల స్వప్నం. కడియం పూల గుబాళింపులు విదేశాలకు చేరేలా ‘కార్గో’ సేవలు విస్తరించాలని, గోదావరిపై సీప్లేన్ పర్యాటకం కొత్త పుంతలు తొక్కాలని కోరుతున్నారు. వాణిజ్య, పర్యాటక అభివృద్ధికి విమానయాన రంగం ఊతమివ్వాలని ఆశిస్తున్నారు.

News December 7, 2025

రాజమండ్రి విద్యార్థి సూపర్ టాలెంట్

image

రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్‌లోని శ్రీనివాస రామానుజం మున్సిపల్ హైస్కూల్‌కు చెందిన ఎం.సంజయ్ కుమార్ (10వ తరగతి) యోగా అండర్-17 బాలుర విభాగంలో ప్రతిభ చూపాడు. బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో విన్నర్‌గా నిలిచిన సంజయ్, జనవరిలో త్రిపురలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం పీకే ఎన్ సత్యవతి తెలిపారు. పీఈటీ డి. విజయ్ విక్టర్, ఉపాధ్యాయులు సంజయ్‌ని అభినందించారు.

News December 7, 2025

రాజమండ్రి విద్యార్థి సూపర్ టాలెంట్

image

రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్‌లోని శ్రీనివాస రామానుజం మున్సిపల్ హైస్కూల్‌కు చెందిన ఎం.సంజయ్ కుమార్ (10వ తరగతి) యోగా అండర్-17 బాలుర విభాగంలో ప్రతిభ చూపాడు. బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో విన్నర్‌గా నిలిచిన సంజయ్, జనవరిలో త్రిపురలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం పీకే ఎన్ సత్యవతి తెలిపారు. పీఈటీ డి. విజయ్ విక్టర్, ఉపాధ్యాయులు సంజయ్‌ని అభినందించారు.