News July 27, 2024

తూ.గో: రూ.2కోట్లతో పరార్.. 24గంటల్లో అరెస్ట్

image

ATMలలో డిపాజిట్ చేయాల్సిన డబ్బుతో పరారైన ఉద్యోగి వాసంశెట్టి అశోక్‌ను 24 గంటల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూ.గో‌ ఎస్పీ కిశోర్ కుమార్ మాట్లాడుతూ.. జల్సాలకు అలవాటు పడి నగదు చోరీకి పాల్పడ్డట్లు గుర్తించామన్నారు. రాత్రి వర్షంలో మండపేట సమీపంలో వాసంశెట్టి అశోక్‌ను అరెస్టు చేశామని తెలిపారు. అతడిపై చట్టపరంగా కఠిన చర్యలు‌ తీసుకుంటామన్నారు. 24 గంటల్లో కేసును చేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

Similar News

News December 7, 2025

రాజమండ్రిలో నేటి చికెన్ ధరలు ఇలా

image

రాజమండ్రి మార్కెట్లో ఆదివారం చికెన్, మటన్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. స్కిన్ లెస్ చికెన్ ధర కేజీ రూ.250గా ఉండగా, స్కిన్ చికెన్ రూ.230కి విక్రయిస్తున్నారు. లైవ్ కోడి రూ.140-150 మధ్య లభిస్తోంది. ఇక, మటన్ ధర కేజీకి రూ.900గా ఉంది. ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు నమోదవుతున్నాయి. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News December 7, 2025

కొవ్వూరు బీజేపీలో ఆధిపత్య పోరు

image

కొవ్వూరు BJPలో ఆధిపత్య పోరు ఉందని ప్రచారం సాగుతోంది. జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పరిమి రాధాకృష్ణ మధ్య సఖ్యత లోపించిందని క్యాడర్ గుసగుసలాడుతోంది. తాజాగా కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో రెండు హాల్టుల పునరుద్ధరణపై ఇరువురు నేతలు తమ మద్దతుదారులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. క్రమశిక్షణకు మారుపేరైన BJPలో ఇలాంటి పరిస్థితి ఏంటని కార్యకర్తలు వాపోతున్నారు.

News December 7, 2025

నేర నియంత్రణకు కఠిన చర్యలు: ఎస్పీ

image

శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యమని ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. నేర నియంత్రణలో భాగంగా జిల్లాలో 317 మందిపై రౌడీషీట్లు తెరిచినట్లు ప్రకటించారు. 19 మందిపై పీడీ యాక్ట్, పలువురిపై పీఈటీ ఎన్ఏఎస్ నమోదు చేశామని, 432 మందిపై బైండోవర్ కేసులు పెట్టామని వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం అవసరమన్నారు.