News May 23, 2024

తూ.గో: రేపు బాలికల క్రికెట్ జట్టుకు ఎంపికలు

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రికెట్ మైదానంలో ఈ నెల 24న బాలికల అండర్-15, 19 సీనియర్స్ విభాగాల్లో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యదర్శి సత్యనారాయణ బుధవారం తెలిపారు. అండర్ 15 జట్టుకు సెప్టెంబర్ ఒకటి 2009, అండర్ 19 జట్టుకు సెప్టెంబర్ ఒకటి 2005 తరువాత పుట్టిన వారు అర్హులన్నారు.

Similar News

News October 22, 2025

అనిత సహనం కోల్పోతే పవన్‌కు గడ్డు పరిస్థితులు: మేడా

image

పిఠాపురంలో జరుగుతున్న నేరాలపై దృష్టి సారించకుండా, భీమవరంలో జూదాల కోసం డీఎస్పీ జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడం హాస్యాస్పదమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. హోం మంత్రి అనిత శాఖనే పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. అనిత సహనం కోల్పోతే పవన్‌కు గడ్డు పరిస్థితులు తప్పవన్నారు.

News October 22, 2025

కడియం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

జాతీయ రహదారి 216ఏపై కడియపులంక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం జిల్లా గాజువాక అగనంపూడికి చెందిన దాసరి కిరణ్ కుమార్ (26) మృతి చెందాడు. విజయవాడ నుంచి కారులో వస్తున్న కిరణ్ కుమార్, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. తీవ్ర గాయాలైన కిరణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News October 21, 2025

రాజమండ్రిలో ‘పోలీస్ కమేమరేషన్ డే’

image

రాజమండ్రిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం నిర్వహించిన ‘పోలీస్ కమేమరేషన్ డే’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమరులైన పోలీసు సిబ్బందికి ఘన నివాళులు అర్పించారు. మంత్రి కందుల దుర్గేశ్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ పాల్గొని అమరులకు పుష్పాంజలి ఘటించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి కందుల అన్నారు.