News June 29, 2024
తూ.గో రైతులకు సిరులు కురిపిస్తున్న పొగాకు

తూ.గో జిల్లాలో రైతాంగానికి పొగాకు సిరులు కురిపిస్తుంది. ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంట అయిన వర్జీనియా పొగాకు గత 50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ధర పలుకుతుంది. పొగాకు సాగు ప్రారంభం నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రెండేళ్ల కాలంలో కిలో పొగాకు రూ.368 పలికింది. దీంతో తమ కష్టానికి తగిన ఫలితం చూస్తున్నామనే భావనతో పొగాకు రైతుల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
Similar News
News January 3, 2026
గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం

కొవ్వూరు ఎరినమ్మ ఘాట్ వద్ద శనివారం గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పట్టణ సీఐ పీ. విశ్వం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడికి సుమారు 60 ఏళ్లు పైబడి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతుడి వద్ద ఏ విధమైన ఆధారాలు లభ్యం కాలేదన్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు 9440796622కు కాల్ చేయాలన్నారు.
News January 3, 2026
ఈ నెల 3న రాజమండ్రిలో పర్యటించనున్న కమిషన్ చైర్పర్సన్

ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ జనవరి 3న తూ.గో జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారులు శుక్రవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 8.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి రోడ్డుమార్గం ద్వారా బయలుదేరి 11 గంటలకు రాజమండ్రి చేరుకుంటారన్నారు. 12 గంటలకు రాజమండ్రిలో నిర్వహించనున్న ‘మహిళా విద్యావేత్తల సాధికారత –వృత్తి & వ్యక్తిగత సమతుల్యత’ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.
News January 3, 2026
ఈ నెల 3న రాజమండ్రిలో పర్యటించనున్న కమిషన్ చైర్పర్సన్

ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ జనవరి 3న తూ.గో జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారులు శుక్రవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 8.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి రోడ్డుమార్గం ద్వారా బయలుదేరి 11 గంటలకు రాజమండ్రి చేరుకుంటారన్నారు. 12 గంటలకు రాజమండ్రిలో నిర్వహించనున్న ‘మహిళా విద్యావేత్తల సాధికారత –వృత్తి & వ్యక్తిగత సమతుల్యత’ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.


