News September 22, 2024
తూ.గో.: వాగులో ఐదుగురు MBBS విద్యార్థులు గల్లంతు

మారేడుమిల్లి మండలం జలతరంగిణి కాలువలో పడి ఐదుగురు మెడికల్ విద్యార్థులు గల్లంతయ్యారు. వివరాలు.. ఏలూరులోని ఆశ్రమ్ మెడికల్ కళాశాలలో MBBS చదువుతున్న కొందరు విద్యార్థులు ఆదివారం పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు మారేడుమిల్లికి వెళ్లారు. వీరిలో ఐదుగురు గల్లంతవగా స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరిని సురక్షితంగా రక్షించినట్లు మారేడుమిల్లి సీఐ గోపాలకృష్ణ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 9, 2025
తూ.గో జిల్లాలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్

రాజమండ్రి జిల్లా ఎస్పీ డి.నరసింహ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్” నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల దూరంలో ఉన్న షాపులు, దుకాణాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పొగాకు ఉత్పత్తులు, గుట్కా నిల్వలు, ఇతర నిషేధిత మత్తు పదార్థాల అమ్మకాలపై పోలీసులు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు.
News July 8, 2025
ధవలేశ్వరంలో 11 కిలోల గంజాయి స్వాధీనం

ధవళేశ్వరంలో 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ టి.గణేశ్ తెలిపారు. కడియం సీఐ వెంకటేశ్వరరావు, ధవళేశ్వరం ఎస్ఐ హరిబాబు, ఈగల్ టీమ్తో కలిసి పీవీఆర్ పీ లేఅవుట్లో దాడి చేసి నిందితులను పట్టుకున్నామని పేర్కొన్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరుస్తామని సీఐ వెల్లడించారు.
News July 8, 2025
తూ.గో: రేపు దేశవ్యాప్త సమ్మె

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని గోపాలపురం ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ బుధవారం దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నామని తెలిపారు. ఈ మేరకు సమ్మె పత్రాలను వైద్యులకు అందజేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రూ.10 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు.