News March 30, 2024

తూ.గో: వేసవి ప్రారంభంలోనే భానుడి భగభగలు

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో వేసవికాలం ప్రారంభంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి ఆఖరు నాటికే సుమారు 35-38 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. రోజురోజుకు ఎండ తీవ్రమై ప్రయాణికులు, పనులకు వెళ్లిన వారు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ముగిసే నాటికి సాధారణ ఉష్ణోగ్రతల కంటే దాదాపు 3 డిగ్రీల వరకూ అధికంగా నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

Similar News

News January 4, 2026

RJY: ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్

image

తూర్పుగోదావరి జిల్లాలో ‘ఆవాస్ ప్లస్’ హౌసింగ్ సర్వే పూర్తయినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 23,676 మంది లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. సొంత స్థలం ఉన్నవారు, లేనివారితో పాటు గతంలో ఇళ్లు అసంపూర్తిగా నిలిచిన వారి వివరాలను సేకరించారు. రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్, దేవరపల్లి సహా పలు మండలాల్లో ఈ లబ్ధిదారులు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

News January 4, 2026

9న రాజమండ్రిలో మెగా జాబ్ మేళా

image

రాజమండ్రి మంజీర కన్వెన్షన్స్‌లో జనవరి 9న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మాజీ MP మార్గాని భరత్ శనివారం ప్రకటించారు. సుమారు 70 ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ మేళా ద్వారా 3,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News January 4, 2026

9న రాజమండ్రిలో మెగా జాబ్ మేళా

image

రాజమండ్రి మంజీర కన్వెన్షన్స్‌లో జనవరి 9న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మాజీ MP మార్గాని భరత్ శనివారం ప్రకటించారు. సుమారు 70 ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ మేళా ద్వారా 3,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.