News March 30, 2024

తూ.గో: వేసవి ప్రారంభంలోనే భానుడి భగభగలు

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో వేసవికాలం ప్రారంభంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి ఆఖరు నాటికే సుమారు 35-38 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. రోజురోజుకు ఎండ తీవ్రమై ప్రయాణికులు, పనులకు వెళ్లిన వారు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ముగిసే నాటికి సాధారణ ఉష్ణోగ్రతల కంటే దాదాపు 3 డిగ్రీల వరకూ అధికంగా నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

Similar News

News March 15, 2026

ఏలూరు జిల్లాలో డ్యామ్‌లో మునిగి దేవరపల్లి వాసుల మృతి

image

దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి డ్యామ్‌లో మునిగి మరణించారు. గల్లంతైన వారిని తుమ్మల నాగరాజు, రమణగా గుర్తించారు. పోలీసుల వివరాలు.. గుబ్బల మంగమ్మ ఆలయంకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

News March 15, 2026

ఏలూరు జిల్లాలో డ్యామ్‌లో మునిగి దేవరపల్లి వాసుల మృతి

image

దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి డ్యామ్‌లో మునిగి మరణించారు. గల్లంతైన వారిని తుమ్మల నాగరాజు, రమణగా గుర్తించారు. పోలీసుల వివరాలు.. గుబ్బల మంగమ్మ ఆలయంకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

News March 15, 2026

అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేయవద్దు- కలెక్టర్

image

గ్యాస్ సరఫరాపై వినియోగదారులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. తప్పుడు వార్తలను నమ్మి ఒకేసారి ఎక్కువ బుకింగ్‌లు చేయవద్దని, అవసరమైనప్పుడే సిలిండర్లు తీసుకోవాలని కోరారు. వాట్సాప్, మిస్డ్ కాల్ లేదా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా ఇంటి నుండే సులభంగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చని సూచించారు. సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని, ఆయిల్ కంపెనీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ఆమె భరోసా ఇచ్చారు.