News April 17, 2024
తూ.గో: వైసీపీకి ఇద్దరు ప్రముఖుల రాజీనామా

కమ్మ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పదవికి, వైసీపీ పార్టీ సభ్యత్వానికి కొటారు అశోక్ బాబా, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యుడు లంకసాని శ్రీనివాసరావు బుధవారం రాజీనామా చేశారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఇద్దరు నాయకులు త్వరలో టీడీపీలో చేరతామని వెల్లడించారు.
Similar News
News February 13, 2026
సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే బత్తుల భేటీ

సీఎం చంద్రబాబుతో రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల అనంతరం భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సీఎంకు అందించారు. 2027 పుష్కరాలకు రాజానగరం నియోజకవర్గానికి ప్రాధాన్యత నిచ్చి తగిన నిధులు కేటాయించాలని, సాగు, తాగునీటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. వాటిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.
News February 13, 2026
సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే బత్తుల భేటీ

సీఎం చంద్రబాబుతో రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల అనంతరం భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సీఎంకు అందించారు. 2027 పుష్కరాలకు రాజానగరం నియోజకవర్గానికి ప్రాధాన్యత నిచ్చి తగిన నిధులు కేటాయించాలని, సాగు, తాగునీటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. వాటిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.
News February 12, 2026
గోదావరి పుష్కరాలు.. ట్రాఫిక్ మళ్లింపుపై కలెక్టర్ పరిశీలన

2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో నగరంలోకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ సౌకర్యాల ఏర్పాటుపై కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్, మోటార్ సైకిళ్లు తదితర వాహనాలకు సంబంధించి సమగ్ర రూట్ మ్యాప్ రూపొందించాల్సిన అవసరంపై అధికారులతో చర్చించారు. మహాశివరాత్రి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.


