News June 22, 2024
తూ.గో: స్నానానికి దిగి మహిళ మృతి

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి ఓ గుర్తుతెలియని మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఘటనా స్థలానికి కొవ్వూరు పట్టణ పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.
Similar News
News January 9, 2026
పాసు పుస్తకాల్లో తప్పులు.. 16 వేల బుక్కులు వెనక్కి!

రీ సర్వేలో భాగంగా ముద్రించిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల్లో తప్పులు దొర్లడంతో 16,101 పుస్తకాలను వెనక్కి పంపినట్లు తూ.గో. డీఆర్వో సీతారామమూర్తి శుక్రవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 1,04,618 పుస్తకాలను పరిశీలించగా ఇవి వెలుగుచూశాయన్నారు. బ్యాంకుల్లో తాకట్టు ఉన్న పాత పుస్తకాలను ఇచ్చి కొత్తవి తీసుకోవాలని కలెక్టర్ సూచించినట్లు పేర్కొన్నారు. రైతులు తమ వివరాలను సరిచూసుకోవాలని అధికారులు వెల్లడించారు.
News January 9, 2026
సంక్రాంతి వేళ డ్రోన్ల నిఘా.. ఎస్పీ వార్నింగ్!

సంక్రాంతి వేళ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ నర్సింహ కిషోర్ వెల్లడించారు. భద్రతలో భాగంగా డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచినట్లు తెలిపారు. నేర నియంత్రణకు పోలీస్ బృందాలు గ్రామాల్లో పర్యటిస్తూ స్థానికులకు అవగాహన కల్పిస్తున్నాయని చెప్పారు. పండుగ పూట ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు ఎస్పీ స్పష్టం చేశారు.
News January 9, 2026
రాజమండ్రి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా జాబ్ మేళా

రాజమండ్రిలో శనివారం నిర్వహించే మెగా జాబ్ మేళా బ్రోచర్ను మాజీ ఎంపీ మార్గాని భరత్ గురువారం విడుదల చేశారు. మంజీర కన్వెన్షన్లో ఈ మెగా జాబ్ కార్యక్రమం జరగనుంది. ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హులైన వారికి అక్కడికక్కడే నియామక పత్రాలు అందజేస్తామని భరత్ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని ఆయన కోరారు.


