News October 18, 2024

తూ.గో: హైదరాబాద్‌లో ముగ్గురు యువకులు అరెస్ట్

image

హైదరాబాద్‌లో సాఫ్టవేర్ ఉద్యోగులు చేస్తున్న తూ.గో జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు గంజాయి విక్రయిస్తూ గురువారం పోలీసులకు చిక్కారు. కేపీహెచ్‌బీలోని పలువురు యువకులు గంజాయి పొట్లాలతో ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఆలమూరు మండలానికి చెందిన తోరటి రాజేశ్(24), కొత్తపల్లి మండలానికి చెందిన నక్కా నాగవంశీ (23), రాజమండ్రికి చెందిన తంగెళ్ల రమేశ్‌గా గుర్తించారు.

Similar News

News November 2, 2025

తాళ్లపూడిలో నేటి చికెన్ ధరలు ఇలా

image

కార్తీక మాసం కారణంగా తాళ్లపూడి మండలంలో మాంసం విక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. ఆదివారం నాటికి కిలో చికెన్ రూ.200-220 పలుకుతుండగా, నాటుకోడి రూ.600, మేక మాంసం రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు గణనీయంగా తగ్గడంతో వ్యాపారం మందగించిందని వ్యాపారులు చెబుతున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయగలరు.

News November 1, 2025

పుష్కర కాలువలో దూకి యువకుడి ఆత్మహత్య

image

గోకవరం మండలం తంటికొండకు చెందిన కామిశెట్టి పుష్ప భగవాన్ (35) పుష్కర కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ శనివారం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 1, 2025

వృద్ధుని ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసిన కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒక వృద్ధుని ఇంటికి వెళ్లి కలెక్టర్ తన చేతుల మీదుగా పింఛన్ సొమ్మును అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ మూర్తి, ఏడీ శశిబిందు, ఎంపీడీవో అశోక్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.