News June 21, 2024

తూ.గో.: ‘500 మార్కుల కంటే ఎక్కువ వస్తే బహుమతి’

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో ఈ ఏడాది టెన్త్ పరీక్ష ఫలితాల్లో 500 మార్కులు పైగా వచ్చిన భట్రాజు సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు రూ.2 వేల నగదు ప్రోత్సాహక బహుమతి, జ్ఞాపిక అందిస్తామని తూ.గో జిల్లా భట్రాజు సంక్షేమ సంఘం అధ్యక్షుడు లోలభట్టు శ్రీనివాసరాజు రాజమండ్రిలో గురువారం తెలిపారు. మార్కుల జాబితా, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్‌తో ఈ నెలాఖరులోగా 94935 47944 నంబర్‌కు వివరాలు పంపాలని సూచించారు.

Similar News

News January 23, 2026

తూ.గో. జిల్లాలో కలిసిన 4 పోలీస్ స్టేషన్‌లు

image

జిల్లాల పునర్విభజనలో భాగంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గాన్ని తూ.గో జిల్లాలో విలీనం చేస్తూ కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీని ప్రకారం రామచంద్రాపురం సబ్ డివిజన్ పరిధిలోని మండపేట టౌన్, రూరల్, అంగర, రాయవరం పోలీస్ స్టేషన్లు రాజమహేంద్రవరం తూర్పు మండలం పరిధిలోకి వచ్చాయి. అలాగే, తూర్పు మండలంలోని బొమ్మూరు స్టేషన్‌ను దక్షిణ మండలానికి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

News January 23, 2026

రాజమండ్రిలో ఎస్పీ నేర సమీక్షా సమావేశం

image

జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ గురువారం పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. PGRS ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించాలని, మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని, రౌడీ షీటర్ల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News January 23, 2026

రాజమండ్రిలో ఎస్పీ నేర సమీక్షా సమావేశం

image

జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ గురువారం పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. PGRS ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించాలని, మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని, రౌడీ షీటర్ల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు.