News July 9, 2024
తూ.గో: UPDATE.. కారు దిగడంతో దక్కిన ప్రాణం

లక్ష్మీనగర్ వద్ద <<13586316>>కంటెయినర్ను కారు ఢీకొని<<>> ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. రాజమండ్రి రూరల్లోని రాజవోలుకు చెందిన భాగ్యశ్రీకి HYDలో ఇంటర్వ్యూ ఉండగా.. పేరెంట్స్ కమలాదేవి-నారాయణరావు, పిల్లలు నాగ నితీశ్, నాగషణ్ముక్తో కలిసి కారులో వెళ్లారు. తిరిగి వస్తుండగా నారాయణరావు విజయవాడలో దిగిపోయారు. అంతలో యాక్సిడెంట్ జరిగి భాగ్యశ్రీ, కమల, నితీశ్ మృతి చెందారు. నాగశ్రీ భర్త నాగార్జున ప్రైవేట్ జాబ్ చేస్తారు.
Similar News
News November 18, 2025
రాజమండ్రి: నారా లోకేశ్ పర్యటన వాయిదా.. కారణం ఇదే

నవంబర్ 20న రాజమహేంద్రవరం సిటీలో జరగాల్సిన రాష్ట్ర ఐటీ,విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు నగర టీడీపీ కార్యాలయానికి సమాచారం అందింది. ఈ నెల 20వ తేదీన నితీష్కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి లోకేశ్ కూడా హాజరుకానున్నారు. అందువలనే పర్యటన వాయిదా పడినట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.
News November 18, 2025
రాజమండ్రి: నారా లోకేశ్ పర్యటన వాయిదా.. కారణం ఇదే

నవంబర్ 20న రాజమహేంద్రవరం సిటీలో జరగాల్సిన రాష్ట్ర ఐటీ,విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు నగర టీడీపీ కార్యాలయానికి సమాచారం అందింది. ఈ నెల 20వ తేదీన నితీష్కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి లోకేశ్ కూడా హాజరుకానున్నారు. అందువలనే పర్యటన వాయిదా పడినట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.
News November 18, 2025
రాజమండ్రి: ఒకేసారి రెండు పథకాల డబ్బులు..!

తూర్పు గోదావరి జిల్లాలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా 1,14,991 మంది లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు డీఏఓ ఎస్.మాధవరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అన్నదాత సుఖీభవ కింద రూ. 57.50 కోట్లు (ఒక్కో రైతుకు రూ. 5000), పీఎం కిసాన్ కింద రూ. 19.50 కోట్లు (ఒక్కో రైతుకు రూ. 2000) మంజూరయ్యాయి. మొత్తం రూ. 77 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.


