News May 11, 2024
తెనాలిలో తండ్రీ, కూతురు, మనవరాలు గెలుపు

గుంటూరు జిల్లా రాజకీయాల్లో తెనాలికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో తెనాలి రాజకీయాల్లో ఒక కుటుంబం చిరస్థాయిగా నిలిచిపోయింది. 1952, 55, 62లో ఆలపాటి వెంకట రామయ్య ఎమ్మెల్యేగా గెలుపొందగా.. ఆయన బాటలోనే ఆయన కుమార్తె దొడ్డపనేని ఇందిరా 1967, 72, 78 ఎన్నికల్లో గెలుపొందారు. అనంతరం 1999లో ఆయన మనవరాలు గోగినేని ఉమా ఎమ్మెల్యేగా గెలుపొంది ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న కుటుంబంగా చరిత్ర సృష్టించారు.
Similar News
News April 17, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో ‘త్రీ స్టార్’ వసతులు కల్పించాలి: లోకేశ్

ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ కీలక సమీక్ష నిర్వహించారు. విద్యాసంస్థల్లో సిబ్బంది, విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ముఖ ఆధారిత గుర్తింపు పురోగతిపై ఆరా తీశారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై చర్చించిన ఆయన, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘త్రీ స్టార్’ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యార్థులకు అత్యుత్తమ వసతులు అందించాలని అధికారులను ఆదేశించారు.
News April 16, 2026
విజయవాడలో హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత!

వైద్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాధితుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మంగళగిరికి చెందిన సుభాని (31) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు ఇంకా నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. తాము ఇంకా నగదు చెల్లించలేమని హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
News April 16, 2026
విజయవాడలో హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత!

వైద్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాధితుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మంగళగిరికి చెందిన సుభాని (31) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు ఇంకా నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. తాము ఇంకా నగదు చెల్లించలేమని హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.


