News October 5, 2024

తెనాలి పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తా: పెమ్మసాని

image

తెనాలి పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర-2047 యాక్షన్ ప్లాన్, తెనాలి పట్టణ అభివృద్ధి పనులపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధికి చేయాల్సిన పనుల గురించి అధికారులతో చర్చించారు.

Similar News

News April 10, 2026

సీనియర్ T-20 గుంటూరు జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక

image

ఈ నెల 11 నుంచి 14 వరకు మూలపాడులో నిర్వహించనున్న ACA సీనియర్ T-20 మెన్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ పోటీలకు గుంటూరు జిల్లా సీనియర్ జట్టు ఎంపికైంది. క్రీడాకారులు షేక్‌ రషీద్(C), మహీప్, వంశీకృష్ణ(WC), అఖిల్, సిద్దార్థ్, ప్రణయ్ కుమార్, సమన్విత్, షేక్‌ అస్లాం బేగ్, రేవంత్ కుమార్, సిద్దు కార్తీక్ రెడ్డి, ఆకాశ్, షేక్.తౌఫిక్, మనోహర్, జయచంద్రకేశవ్, షేక్.బాజీ ఎంపికయ్యారు. మరో ఆరుగురు స్టాండ్ బైస్ ఉన్నారు.

News April 9, 2026

గుంటూరు: ఎస్పీలుగా పలువురి పేర్లు పరిశీలన

image

గుంటూరు జిల్లాలో పలువురు అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ఎస్పీల ప్యానెల్ జాబితాలో గుంటూరులో పనిచేస్తున్న పలువురు అదనపు ఎస్పీల పేర్లు ఉన్నాయి. గుంటూరు క్రైమ్స్ అదనపు ఎస్పీ కే. సుప్రజ, ఎల్ అండ్ ఓ అదనపు ఎస్పీ ఏ.టీ.వి రవికుమార్, అడ్మిన్ అదనపు ఎస్పీ జీ.వీ. రమణమూర్తి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. వీరికి త్వరలో ఎస్పీలుగా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది.

News April 9, 2026

అమరావతిలో కేంద్ర కామన్ సెంట్రల్ సెక్రటేరియట్‌కు రంగం సిద్ధం

image

అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కీలక ప్రాజెక్ట్ అమలుకు ముందడుగు పడింది. రూ.2,534 కోట్ల వ్యయంతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర ప్రజా నిర్మాణ విభాగం డీపీఆర్ సిద్ధం చేసి కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి పంపింది. ఆమోదం లభించిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ భవనం పూర్తయితే పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట పనిచేసే అవకాశం ఏర్పడి రాజధాని పరిపాలనా ప్రాధాన్యం మరింత పెరగనుంది.