News February 16, 2025
తెనాలి: రైలు ఢీకొని మహిళ దుర్మరణం

తెనాలి మండలం కొలకలూరు రైల్వే స్టేషన్లో దారుణం జరిగింది. పట్టాలు దాటుతుండగా కొలకలూరుకు చెందిన పద్మావతి(55) అనే మహిళను సూపర్ ఫాస్ట్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. విజయవాడ నుంచి ఒంగోలు వెళ్లే ప్యాసింజర్ ఎక్కేందుకు వచ్చిన పద్మావతి స్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
Similar News
News March 4, 2026
జీజీహెచ్లో మెరుగైన వైద్యసేవలు అందించాలి: కలెక్టర్

గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యులు నిబద్ధతతో విధులు నిర్వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ప్రభుత్వ వైద్యశాల అధికారులను ఆదేశించారు. జీజీహెచ్ అధికారులతో కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నైట్ షిప్ట్లలో విధులు నిర్వహించే విభాగాల వైద్యులు, క్యాజువాలిటి, రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ డ్యూటీల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
News March 4, 2026
గుంటూరు జిల్లాలో 5 రేషన్ దుకాణాలపై కేసులు

గుంటూరు జిల్లాలో 5 చౌకధరల దుకాణాల పై కేసులు నమోదు చేసినట్లు JC అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లాలో ఇప్పటికి 244 రేషన్ షాపులను తనిఖీ చేశామని, తనిఖీల్లో సరుకులో వ్యత్యాశం గుర్తించి పెదకాకాని మండలంలో 3, ఫిరంగిపురంలో 1, నల్లచెరువులో 1 షాపు పై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. కార్డుదారుల నుంచి అక్రమంగా పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్న 4 వాహనాలను పట్టుకున్నామన్నారు.
News March 4, 2026
పెదకాకానిలో విషాదం.. నాలుగేళ్ల బాలిక మృతి

పెదకాకాని మండల కేంద్రానికి చెందిన శిరీషా (4) బుధవారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. శిరీషా ఆడుకుంటూ బూరను మింగింది. ఊపిరి ఆడక అస్వస్థతకు గురవడంతో గుంటూరు GGHకు తరలించారు. చికిత్స అందించినప్పటికి బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


