News January 29, 2025

తెనాలి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతి మృతి

image

అంగలకుదురు శివారులో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వీరిలో మల్లెపాడుకు చెందిన చిలుమూరి మాలతి(22)చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. నాజరుపేటకు చెందిన రమ్య, మాలతి గుంటూరులో ప్రైవేట్ జాబ్ చేస్తూ 27న రాత్రి స్కూటీపై తెనాలి వస్తున్నారు. గతుకుల రోడ్డులో ఎదురు వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఇరువురిలో మాలతి మృతి చెందింది.

Similar News

News December 5, 2025

ఈ నెల 8 నుంచి ANU యువజన ఉత్సవాలు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యువజన ఉత్సవాలను ఈ నెల 8, 9, 10 తేదీలలో జరుగుతాయని యువజన ఉత్సవాల కోఆర్డినేటర్ మురళీమోహన్ తెలిపారు. 6వ తేదీ నుంచి ప్రారంభించాల్సిన ఉత్సవాలను విద్యార్థుల అభ్యర్థన మేరకు 8వ తేదీకి మార్చినట్లు తెలిపారు. మ్యూజిక్, డాన్స్, లిటరరీ ఈవెంట్స్, థియేటర్, ఫైన్ ఆర్ట్స్ వంటి అంశాలలో పోటీలు ఉంటాయని చెప్పారు. వర్సిటీలోని కళాశాలలతో పాటు, అనుబంధ కళాశాల విద్యార్థులు పాల్గొనాలని కోరారు.

News December 5, 2025

GNT: జాతీయ రహదారిపై ప్రమాదం.. విద్యార్థిని స్పాట్ డెడ్

image

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో SRM యూనివర్సిటీ విద్యార్థిని అక్కడికక్కడే మరణించింది. మృతురాలు SRMలో BBA చదువుతున్న మచిలీపట్నానికి చెందిన సుమయ్య (18)గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News December 5, 2025

కేఎల్‌యూలో నేడు ‘ఉద్భవ్-2025’ ముగింపు సంబరాలు

image

వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో జరుగుతున్న 6వ జాతీయ ఏకలవ్య సాంస్కృతిక ఉత్సవాలు ‘ఉద్భవ్-2025’ నేటితో ముగియనున్నాయి. గిరిజన సంక్షేమ గురుకులాల ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు ముగింపు వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేశ్, డోలా బాలవీరాంజనేయస్వామి, గుమ్మడి సంధ్యారాణి అతిథులుగా హాజరవుతారు. గిరిజన విద్యార్థుల కళా ప్రదర్శనల అనంతరం, చేతులకు బహుమతులు అందించనున్నారు.