News March 6, 2025
తెనాలి: వేరువేరు ఘటనల్లో ఇద్దరు మృతి

తెనాలి రైల్వేస్టేషన్లో బుధవారం సుమారు 60 ఏళ్ల మహిళ ప్లాట్ఫారం చివర పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొట్టడంతో మరణించింది. ఆమె వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన మహిళగా పోలీసులు భావిస్తున్నారు. మరో ఘటనలో తిరుమల ఎక్స్ ప్రెస్లో ప్రయాణిస్తున్న సుమారు 50ఏళ్ల వ్యక్తి తెనాలి శివారు యడ్ల లింగయ్య కాలనీ రైల్వే గేటు సమీపంలో రైలు నుంచి జారిపడి మృతిచెందాడు. జీఆర్పీ పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
Similar News
News October 16, 2025
అమరావతి: 40 ఎకరాల భూమి ఇచ్చేందుకు రైతుల అంగీకారం

అమరావతి భూ సమీకరణకు రైతులు స్వచ్ఛందంగా 40.25 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. కమిషనర్ కె. కన్నబాబు చర్చలు ఫలించాయి. ఉండవల్లిలో అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు, కొండవీటి వాగు, ఇతర రోడ్ల నిర్మాణ పనుల కోసం 22 మంది రైతులు 12 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. పెనుమాకలో 14 మంది రైతులు 28.25 ఎకరాల భూమి ఇచ్చేందుకు అంగీకరించారు.
News October 16, 2025
గుంటూరు మిర్చి యార్డులో ధరలు..

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం లక్ష క్వింటాళ్ల AC సరుకు అమ్మకానికి వచ్చింది. రకం, నాణ్యతను బట్టి క్వింటాలుకు ధరలు ఇలా ఉన్నాయి. తేజా, 355, 2043 రకాలు: కేజీ ₹100 నుంచి ₹160 వరకు పలికాయి. యల్లో రకం: అత్యధికంగా కేజీ ₹200 నుంచి ₹230 వరకు పలికింది. నెంబర్ 5, DD రకాలు: కేజీ ₹110 – ₹155 మధ్య ఉన్నాయి. మీడియం సీడ్ రకాలు ₹80 – ₹100, బుల్లెట్ రకాలు ₹90 – ₹145 మధ్య ట్రేడ్ అయ్యాయి.
News October 16, 2025
దుగ్గిరాల వైసీపీ జెడ్పీటీసీ భర్త అరెస్ట్ ?

దుగ్గిరాల మండలం వైసీపీ జడ్పీటీసీ మేకతోటి అరుణ భర్త వీరయ్యను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆయన భార్య అరుణ ఆరోపించారు. తాడేపల్లి పరిధి కుంచనపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న తన భర్తను అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేశారని అన్నారు. తాడేపల్లి స్టేషన్కు తరలిస్తున్నామని చెప్పారని.. కానీ తన భర్త అక్కడ లేదని అరుణ ఆరోపించారు. ఈ మేరకు తన భర్త ఆచూకీ చెప్పాలని తాడేపల్లి ఠాణాలో గురువారం ఫిర్యాదు చేశారు.