News January 23, 2025
తెనాలి: వైకుంఠపురం హుండీలో రూ.2000 నోట్లు

వైకుంఠపురం దేవస్థానంలో స్వామి వారి హుండీ లెక్కింపును గురువారం నిర్వహించారు. ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, భక్తుల సమక్షంలో లెక్కింపు చేపట్టగా రూ. 2000 నోట్లు ప్రత్యక్షమయ్యాయి. రూ.4 లక్షలు విలువ చేసే మొత్తం 200 నోట్లను గుర్తించారు. 2023 మేలో రూ.2000 నోట్లను ఆర్బిఐ బ్యాన్ చేయగా ఆ ఏడాది అక్టోబర్ నుంచి ఈ నోట్లు వాడుకలో లేవు. అయితే దేవుడి హుండీలో ఈ నోట్లు మళ్లీ ప్రత్యక్షమవడం చర్చనీయాంశమైంది.
Similar News
News February 16, 2025
తెనాలి: రైలు ఢీకొని మహిళ దుర్మరణం

తెనాలి మండలం కొలకలూరు రైల్వే స్టేషన్లో దారుణం జరిగింది. పట్టాలు దాటుతుండగా కొలకలూరుకు చెందిన పద్మావతి(55) అనే మహిళను సూపర్ ఫాస్ట్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. విజయవాడ నుంచి ఒంగోలు వెళ్లే ప్యాసింజర్ ఎక్కేందుకు వచ్చిన పద్మావతి స్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
News February 16, 2025
మంగళగిరి: 5 కిలోల బంగారు ఆభరణాల చోరీ

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద 5 కిలోల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. వాటి విలువ ఐదు కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. బంగారు ఆభరణాలు సంచితో జ్యువెలరీలోని గుమస్తా దీవి నాగరాజు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు.అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలు సంచిని గుర్తుతెలియని యువకులు లాక్కుని పారిపోయారు. ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News February 16, 2025
అధికారులకు GNT జేసీ ఆదేశాలు

గ్రూప్2 మెయిన్స్ పరీక్ష కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ఆదేశించారు. మెయిన్స్ పరీక్ష ఈనెల 23వ తేదీన జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం జిల్లాలో 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పరీక్షకు 9,277 అభ్యర్ధులు హాజరవుతారని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.