News January 11, 2025

తెనాలి: సైనేడ్ కిల్లర్స్ మరోసారి అరెస్ట్

image

సైనేడ్‌ హత్యకేసుల్లో నిందితులను 3 టౌన్ పోలీసులు మరోసారి అరెస్ట్‌ చేశారు. యడ్ల లింగయ్యకాలనీకి చెందిన వెంకటేశ్వరి, తల్లి రమణమ్మలు సైనేడ్‌తో హత్యలు చేసిన కేసులో బెయిల్‌పై వచ్చారు. ఇదే కాలనీకి చెందిన మోషే మృతిపై అనుమానం ఉందంటూ కుటుంబ సభ్యులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయగా ఖననం చేసిన ప్రాంతంలో శవాన్ని తీసి పోస్ట్‌మార్టం చేశారు. సైనేడ్‌ వలనే మోషే మృతిచెందినట్టు తేలగా తల్లి, కూతుర్లను అరెస్టు చేశారు.

Similar News

News October 27, 2025

గుంటూరు: తుఫాన్ దృష్ట్యా పీజీఆర్ఎస్ రద్దు

image

‘మెంథా’ తుఫాన్ దృష్ట్యా సోమవారం గుంటూరు జీఎంసీలో నిర్వహించాల్సిన డయల్ యువర్ కమిషనర్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. గుంటూరు నగర ప్రజలు ఈ రద్దు విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.

News October 26, 2025

గుంటూరు జిల్లా తుఫాన్ కంట్రోల్ రూమ్ నంబర్‌లు

image

GNT కలెక్టరేట్: 0863-2234014
GMC: 0863-2345103
TNL సబ్ కలెక్టర్ ఆఫీస్: 9866671291
గుంటూరు RDO ఆఫీస్: 0863-2240679
మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్: 08645-295192
పొన్నూరు: 08643-247737
తెనాలి: 1800-425 6468
మేడికొండూరు: 9949098615
పెదకాకాని: 9949098617
పెదనందిపాడు: 9949098619
ఫిరంగిపురం: 9949098620
ప్రత్తిపాడు: 9949098621
తాడికొండ: 9949098624
తుళ్లూరు: 9849904017
దుగ్గిరాల: 7032929351.

News October 26, 2025

3 రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సిసోడియా

image

‘మొంథా’ తుఫాన్ దృష్ట్యా జిల్లా పరిస్థితులపై సమీక్షించేందుకు ప్రత్యేక అధికారిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ ఆర్.పి. సిసోడియా ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను కారణంగా ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, తదితరులు పాల్గొన్నారు.