News April 16, 2025
తెలంగాణలో చనిపోయిన ముగ్గురు జిల్లా వాసులు వీరే..

తెలంగాణలో జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ శివారు జాతీయ రహదారి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అమలాపురం(M) సవరప్పాలేనికి చెందిన ఒకే కుటుంబసభ్యులు ముగ్గురు మృతి చెందారు. సత్తి శ్రీను, భార్య రమణకుమారి, కుమార్తె అనూష చనిపోయారు. వీరి మృతదేహాలకు జనగామ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి బుధవారం సొంత గ్రామానికి తీసుకురానున్నట్లు బంధువులు తెలిపారు. వారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News April 22, 2025
నకిలీ పోలీసుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

సాధారణ దుస్తులు ధరించి పోలీసుల పేరు చెప్పి ఎవరైనా వాహనాలు తనిఖీలు చేస్తూ డబ్బులు వసూలు చేసినట్లయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ నరసింహ సూచించారు. పోలీసు సిబ్బంది ఎవరు కూడా సివిల్ డ్రెస్లో వాహనాలు తనిఖీ చేయరని అన్నారు. పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ ఖాకీ యూనిఫామ్ ధరించి వాహనాల తనిఖీలు చేస్తారని తెలిపారు. సివిల్ డ్రెస్లో తనిఖీ నిర్వహించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
News April 22, 2025
నా జిల్లా మొదటి స్థానం: మంత్రి సీతక్క

ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో తన సొంత జిల్లా ములుగు మొదటి స్థానం, తాను ఇన్చార్జిగా ఉన్న ఆసిఫాబాద్ జిల్లా రెండవ స్థానంలో నిలవడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. వెనకబడిన గిరిజన ప్రాంతాలైన ఈ రెండు జిల్లాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటడం ఎంతో సంతోషంగా ఉందని, కలెక్టర్, డీఈఓలను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు
News April 22, 2025
INTER RESULTS.. ఖమ్మంలో బాలికలదే హవా.!

ఇంటర్ ఫలితాల్లో.. ఖమ్మం జిల్లాలో అమ్మాయిలు ప్రతిభ చాటారు. ఫస్టియర్లో 17,837 మందికి 12,476 మంది విద్యార్థులు హాజరు కాగా, జనరల్లో బాలురు 64.51, బాలికలు 77.89 శాతం, ఒకేషనల్లో బాలురు 43.95, బాలికలు 76.13 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్లో 16,919 మందికి 12,996 మంది హాజరు కాగా, జనరల్లో బాలురు 72.10, బాలికలు 83.13 శాతం, ఒకేషనల్లో బాలురు 52.60, బాలికలు 86.90 శాతం ఉత్తీర్ణత సాధించారు.