News April 12, 2025
తెలంగాణలో టాప్ 3లో ఉమ్మడి ADB

భద్రాచలం శ్రీ రాములవారి తలంబ్రాల పంపిణీని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం ప్రణీత్ తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్లోని ఆర్ఎం కార్యాలయంలో పలువురికి తలంబ్రాలను పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,350 మంది బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు. తలంబ్రాల బుకింగ్లో రాష్ట్రంలో ఆదిలాబాద్ రీజియన్ మూడో స్థానంలో నిలిచిందన్నారు. సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News April 15, 2026
చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్ రాజర్షి షా

జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, ప్రధాన కూడళ్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో స్వచ్ఛంద సంస్థలు, రెడ్క్రాస్ను భాగస్వామ్యం చేయాలని సూచించారు. చలివేంద్రాల్లో తాగునీటితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఎండల దృష్ట్యా ప్రజలు తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలని ప్రకటనలో కోరారు.
News April 15, 2026
జిల్లాలో సెగలు.. అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సాధారణం కంటే 1.5°C నుంచి 3.5°C వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని, వారం రోజుల పాటు వేడి గాలులు వీస్తాయని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లాలో ‘హీట్వేవ్ యాక్షన్ ప్లాన్’ను అత్యవసరంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అప్రమత్తతే ఎండ దెబ్బ నుంచి రక్షిస్తుందని పేర్కొన్నారు.
News April 15, 2026
ADB: ’పల్లె వెలుగు’కు మాస్క్.. ఛార్జీల్లో ‘ఎక్స్ప్రెస్’

జిల్లాలోని ఆర్టీసీ డిపోల పరిధిలో ప్రయాణికులను నిలువునా దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘పల్లె వెలుగు’ బస్సులకు ముందు భాగంలో ‘ఎక్స్ప్రెస్’ రంగులు వేసి, లోపల మాత్రం సాధారణ సౌకర్యాలతోనే నడుపుతున్నారు. కానీ, టికెట్ ఛార్జీలు మాత్రం ఎక్స్ప్రెస్ ధరలకే వసూలు చేస్తుండటం గమనార్హం. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని డిపోల్లో బస్సులు చాలా ఉన్నాయని, దీనివల్ల ప్రయాణికులు మండిపడుతున్నారు.


