News April 3, 2025

తెలంగాణలో తొలి ట్రాన్స్‌జెండర్ ట్రాఫిక్ మార్షల్స్

image

సైబరాబాద్‌లో జరీనా, విశాలాక్షి, అనూష, ప్రభ, వాసుప్రియ తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ ట్రాఫిక్ మార్షల్స్‌గా నియమితులయ్యారు. డీసీపీ సృజన కర్నం ఆధ్వర్యంలో ఎంపిక జరిగిందని, ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం పోరాటం కొనసాగాలని ఆక్టివిస్ట్ చంద్రముఖి మువ్వలా అన్నారు. ప్రభుత్వ శాఖల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.

Similar News

News October 16, 2025

ఆ గ్రామాల్లో ఎక్కడ చూసినా పోలీసులే..!

image

నక్కపల్లి హైవే జంక్షన్ నుంచి ఉపమాక మీదుగా రాజీపేట వెళ్లే ప్రధాన రహదారి పలు జంక్షన్లలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కడ చూసినా పోలీసులే కనిపించారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మత్స్యకారులు ఇటీవల హైవేను బ్లాక్ చేయడానికి పోలీస్ యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. మరలా అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అడ్డుకోవడానికి అడుగడుగునా పోలీస్ బలగాలను మొహరించారు.

News October 16, 2025

‘45 కేసుల్లో నిందితుడు.. రోడ్డు ప్రమాదంలో దొరికిపోయాడు’

image

పలు రాష్ట్రాల్లో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను ఉరవకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 10 రోజుల క్రితం విడపనకల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులలో ఒకరు అంతరాష్ట్ర నేరస్థుడు నాగిరెడ్డిగా పోలీసులు గుర్తించారు. కారులో రూ.3.50 లక్షల నగదు, వెండి ఆభరణాలు లభ్యం కావడంతో అనుమానంతో విచారణ చేపట్టారు. నాలుగు రాష్ట్రాల్లో 45 కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నాడన్నారు.

News October 16, 2025

నేడు కర్నూలుకు మోదీ.. షెడ్యూల్ ఇదే!

image

★ గురువారం ఉ.7.20కి ఢిల్లీ నుంచి కర్నూలుకు పయనం
★ ఉ.9.50కి కర్నూలుకు చేరిక, అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో సుండిపెటకు..
★ ఉ.10.35కి సుండిపెంటకు చేరిక.. రోడ్డు మార్గంలో శ్రీశైలానికి పయనం
★ ఉ.11.55 గంటలకు భ్రమరాంబ, మల్లికార్జున స్వామి దర్శనం
★ 12.10కి శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శన
★ 1.35కి హెలికాప్టరులో కర్నూలుకు..
★ మ.2.30కి జీఎస్టీ సభకు హాజరు, ప్రసంగం
★ సా.4.45 గంటలకు ఢిల్లీకి తిరుగు పయనం