News February 16, 2025
‘తెలంగాణ ఉద్యమకారులు.. ముధోల్ నియోజకవర్గం’ పుస్తకావిష్కరణ

అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శనివారం భైంసాలో తెలంగాణ తెలుగు కళానిలయం, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు.. ముధోల్ నియోజకవర్గము, బాల రామ శతకం పుస్తకావిష్కరణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముధోల్ నియోజకవర్గంలోని ప్రజలందరూ భాగస్వాములై ఉద్యమానికి ఊపిరి పోశారని పేర్కొన్నారు.
Similar News
News November 19, 2025
వల్లభాపురం: ప్రమాదవశాత్తు యంత్రంలో పడి మహిళ మృతి

కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామపంచాయతీ పరిధిలోని మాదిగ లంకకు మినుములు నూర్చడానికి వచ్చిన మహిళ ప్రమాదవశాత్తు చనిపోయినట్లు కొల్లిపర ఎస్సై పి.కోటేశ్వరరావు తెలిపారు. వల్లూరుపాలెంకు చెందిన షేక్ కాసింబి(40) ప్రమాదవశాత్తు మినుము నూర్పిడి యంత్రంలో చీర ఇరుక్కుని చేతులు, మెడకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు తెలిపారు. ఆమె భర్త ఇస్మాయిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
News November 19, 2025
తలసానిని కలిసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన నవీన్ యాదవ్.. మామ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తలసానికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ను తలసాని ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.
News November 19, 2025
ఏపీలో MSME ఎకోసిస్టమ్ బలోపేతానికి సహాయం పెంచండి: మంత్రి

ఏపీలోని MSME రంగం అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై కేంద్రంతో చర్చలు జరిగాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర MSME మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి & అభివృద్ధి కమిషనర్ డాక్టర్ రజనీష్ను మంగళవారం కలిశారు. రాష్ట్రంలో అమలవుతున్న MSME ప్రాజెక్టులు, వాటి పురోగతి, అవసరమైన సహాయంపై వివరించానని, ఎకోసిస్టమ్ను బలోపేతం చేయడానికి కేంద్రం నుంచి అందే సహాయాన్ని పెంచాలని కోరినట్లు తెలిపారు.


