News October 9, 2024
తెలంగాణ డీఎస్సీలో సత్తా చాటిన తర్లుపాడు యువతి

తెలంగాణ డీఎస్సీలో తుర్లపాడుకు చెందిన సయ్యద్ రహిమున్ సత్తా చాటారు. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించారు. దీంతో నాన్ లోకల్ కేటగిరీ కింద సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయిని (ఉర్దూ) గా ఎంపికయ్యారు. తండ్రి టైలర్ కాగా తల్లి గృహిణి. పట్టుదలతో తెలంగాణలో ఉద్యోగం సాధించడం పట్ల పలువురు ఆమెను అభినందించారు.
Similar News
News January 10, 2026
ప్రకాశం: ‘సంప్రదాయ క్రీడలను నిర్వహించాలి’

కోడి పందేలు, జూదాలు వంటి అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయ క్రీడలను నిర్వహించాలన్నారు. ఎక్కడైనా కోడిపందేలు నిర్వహిస్తే 112 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే 9121102266 వాట్సాప్ నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు.
News January 10, 2026
ప్రకాశం: సంక్రాంతికి విద్యుత్ శాఖ సూచనలు

సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలను ఎగరేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు సూచించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. గాలిపటాలను ఎగరేసే సమయంలో సమీపంలో ఉన్న కరెంటు తీగలు, ట్రాన్స్ఫార్మర్లను గమనించాలన్నారు. గాలిపటాలు విద్యుత్ తీగలకు చిక్కుకున్న సమయంలో వాటిని తీయరాదన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే 1912 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు.
News January 10, 2026
ప్రకాశం జిల్లాలో 11 మందికి పదోన్నతి

ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యం పరిధిలోని వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న 11 మంది సీనియర్ సహాయకులకు పదోన్నతి కల్పించారు. ఆ ఉత్తర్వులను జెడ్పీ ఛైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ వారికి అందజేశారు. పదోన్నతి పొందిన వారిలో జి. సుగుణశోభారాణిని ఒంగోలు జెడ్పీకి, ఎం.శ్రీవాణిని ఒంగోలు జెడ్పీకి, ఎం. ఇందిరను మర్రిపూడి ఎంపీపీ, డి. ఖాసీంపీరాను బేస్తవారిపేట ఎంపీపీకి కేటాయించారు.


