News February 18, 2025

తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సలహా కమిటీ ఏర్పాటు

image

తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) సలహా కమిటీని ఏర్పాటు చేశారు. ఈనెల 14న సలహా కమిటీకి సంబంధించిన జీవో విడుదల కాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో కమిటీ సభ్యులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు. కమిటీ విశ్లేషణలు రాష్ట్రంలో స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలకు మద్దతుగా ఉంటుందని డిప్యూటీ సీఎం చెప్పారు.

Similar News

News October 23, 2025

ఖమ్మం: మద్యం టెండర్లకు మంచి స్పందన

image

ఖమ్మం జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు భారీ స్పందన లభించింది. గురువారం(నేటి)తో దరఖాస్తు గడువు ముగుస్తుండగా, వ్యాపారులు తీవ్రంగా పోటీ పడ్డారు. జిల్లాలోని 116 షాపులకు బుధవారం వరకు ఏకంగా 4,177 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. చివరి రోజు కావడంతో దరఖాస్తులు మరింత భారీగా దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

News October 23, 2025

KMM: ‘తక్కువ పెట్టుబడి-ఎక్కువ ఆదాయం’ అంటూ మోసం

image

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ ఖమ్మం నగరానికి చెందిన ఓ వైద్య విద్యార్థిని ప్రత్యూషను గుర్తు తెలియని వ్యక్తి మోసం చేశాడు. మధురానగర్‌కు చెందిన ప్రత్యూషకు మొబైల్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తి.. రూ.40 వేలు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించాడు. డబ్బు చెల్లించినా స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News October 23, 2025

ఖమ్మం: పంచారామాలకు ప్రత్యేక డీలక్స్ బస్సు

image

కార్తీక మాసం సందర్భంగా ఖమ్మం కొత్త బస్టాండ్ నుంచి పంచారామాలకు ప్రత్యేక డీలక్స్ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. ఈనెల 26న రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరి అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట చేరుకుంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ.2000, పిల్లలకు రూ.1040గా నిర్ణయించారు. వివరాలకు 91364 46666ను సంప్రదించవచ్చు.