News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. నిర్మల్కు ఏం కావాలంటే..!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నిర్మల్ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కడెం ప్రాజెక్ట్ సుందరీకరణ, గడ్డెన్నవాగు అప్గ్రెడేషన్కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. బాసరను మున్సిపాలిటీగా చేస్తే అభివృద్ధి చెందుతుందని.. పర్యాటకంగా మరిన్ని అవకాశాలు ఏర్పడతాయంటున్నారు. కవ్వాల్ అభయారణ్యం, గోదావరి ఎకో టూరిజంను డెవలప్ చేయాలని కోరుతున్నారు.
Similar News
News November 16, 2025
ఖమ్మం జిల్లాలో 3.5 కోట్ల చేప పిల్లల విడుదల: కలెక్టర్

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 224 మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో 3.5 కోట్ల చేప పిల్లలను నీటి వనరుల్లో విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. చెరువుల్లో ఫీడ్ సక్రమంగా అందేలా, నీరు కలుషితంగాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 17 లక్షల చేప పిల్లలను ఉచితంగా విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రమాదాల్లో మృతి చెందిన కనకయ్య, మంగయ్య కుటుంబాలకు రూ.5 లక్షల బీమా చెక్కును అందజేశారు.
News November 16, 2025
వారణాసి: ఒకేసారి ఇన్ని సర్ప్రైజులా?

రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘<<18299698>>వారణాసి<<>>’ నుంచి వరుస అప్డేట్స్ వచ్చాయి. globe trotter ఈవెంట్లో మూవీ టైటిల్, మహేశ్ ఫస్ట్ లుక్, 3.40 నిమిషాల గ్లింప్స్ రిలీజ్ చేశారు. 2027 సమ్మర్లో మూవీ విడుదల అని కీరవాణి తెలిపారు. రామాయణంలో ముఖ్యమైన <<18299599>>ఘట్టం <<>>తీస్తున్నానని, మహేశ్కు రాముడి వేషం వేశానని రాజమౌళి వెల్లడించారు. దీంతో ఒకేసారి ఇన్ని సర్ప్రైజులు ఇచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
News November 16, 2025
సిటీలో అన్ని సీజన్లలో ట్యాంకర్లకు డిమాండ్

జలమండలి పరిధిలో దాదాపు 5 సంవత్సరాలలో ట్యాంకర్ డిమాండ్ 5 రెట్లు పెరిగింది. 2021లో 59 వేలకుపైగా ఉండగా 2025 నాటికి సుమారు రెండు లక్షల చేరింది. అన్ని సీజన్లలోనూ ట్యాంకర్ల డిమాండ్ ఏర్పడగా అధికారులు కొత్త ఫిల్లింగ్ స్టేషన్ల నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఏర్పడే డిమాండ్ దృష్టిలో పెట్టుకొని చర్యలు చేపడుతున్నారు.


