News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. నిర్మల్కు ఏం కావాలంటే..!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నిర్మల్ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కడెం ప్రాజెక్ట్ సుందరీకరణ, గడ్డెన్నవాగు అప్గ్రెడేషన్కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. బాసరను మున్సిపాలిటీగా చేస్తే అభివృద్ధి చెందుతుందని.. పర్యాటకంగా మరిన్ని అవకాశాలు ఏర్పడతాయంటున్నారు. కవ్వాల్ అభయారణ్యం, గోదావరి ఎకో టూరిజంను డెవలప్ చేయాలని కోరుతున్నారు.
Similar News
News January 22, 2026
AI ప్రయోజనాలు అందరికీ అందాలి: చంద్రబాబు

ప్రభుత్వ సేవలను మెరుగు పరిచేందుకు AIని వినియోగిస్తున్నట్లు CM చంద్రబాబు పేర్కొన్నారు. దావోస్లో AIపై నిర్వహించిన సెషన్లో ప్రసంగించారు. ‘AI కేవలం టెక్ కంపెనీలు, సిటీలకే పరిమితం కాకుడదు. ప్రతి పౌరుడు, రైతులు, విద్యార్థులు, ఎంటర్పెన్యూర్స్ అందరికీ దాని బెనిఫిట్స్ దక్కాలి’ అని తెలిపారు. మరో సెషన్లో రాష్ట్రంలో న్యాచురల్ ఫార్మింగ్ కోసం 20లక్షల ఎకరాలు, 18లక్షల మంది రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
News January 22, 2026
మెదక్: ఒంటరిగా జీవించలేక యువకుడి సూసైడ్

భార్యతో విడిపోయి ఒంటరిగా జీవించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన టేక్మాల్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంపూలూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ కొన్ని రోజుల క్రితం భార్యతో గొడవతో పెద్దల సమక్షంలో విడిపోయాడు. అప్పటి నుంచి మనస్తాపంతో తాగుడుకు బానిసైన ప్రశాంత్.. సోమవారం గ్రామ శివారులో పురుగు మందు తాగాడు. గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
News January 22, 2026
KMR: సమన్వయమే అసలైన సవాలు

కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రస్తుతం తిరుగులేని జోరు ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో అధికారంతో పాటు జిల్లా నేతలు ప్రభుత్వంలో ఉండటం పార్టీకి కొండంత బలాన్నిస్తోంది. బీఆర్ఎస్ నుంచి కీలక నేతల వలసలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. అయితే భారీ చేరికలే పార్టీకి కొత్త తల నొప్పులు తెచ్చేలా ఉన్నాయి. పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం కుదర్చడం ఇప్పుడు నాయకత్వానికి పెద్ద పరీక్షగా మారింది.


