News January 26, 2025

తెలంగాణ భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

image

గణతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామన్నారు.

Similar News

News November 14, 2025

WGL: జిల్లాల పునర్విభజన గందరగోళం!

image

పునర్విభజనలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వం సరిదిద్దకపోవడంపై విమర్శలు పెరుగుతున్నాయి. గందరగోళ విభజనపై సీఎం రేవంత్‌ రెడ్డి కూడా ఆందోళన వ్యక్తం చేసినా మార్పులు కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు. విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తులు చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్‌ అప్డేట్లలో HNK, WGL అర్బన్‌, రూరల్‌ పేర్లు కనిపిస్తుండగా ప్రస్తుతం ఉన్న WGL జిల్లా పేరు లేకపోవడం గమనార్హం.

News November 14, 2025

ప్రతిరోజూ ABC జ్యూస్ తాగితే జరిగేది ఇదే

image

ABC జ్యూస్.. యాపిల్, బీట్‌రూట్, క్యారెట్‌తో తయారు చేస్తారు. షుగర్, విటమిన్లు, ఖనిజాలు, 0.5గ్రా. ప్రొటీన్స్ లభించే ఈ జ్యూస్ తాగితే రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. పరగడుపున తాగితే శరీరంలో వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ముఖం యంగ్‌గా కనిపిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కేలరీలు తక్కువ ఉన్నందున బరువు తగ్గుతారు. 100మి.లీ జ్యూస్‌లో 45-50 కేలరీలు, 10-12గ్రా. కార్బోహైడ్రేట్లు బాడీకి అందుతాయి.

News November 14, 2025

కొడంగల్: శారీరక దృఢత్వానికి కలరిపయట్టు దోహదం..!

image

కొడంగల్ పరిధి హస్నాబాద్‌లో మూడు రోజులుగా కలరిపయట్టు శిక్షణ కొనసాగుతోంది. ఇటివలే గ్రామానికి వచ్చిన సినీ నటుడు ప్రభాకర్ గ్రామ పంచాయతీ ఆవరణలో కొనసాగుతున్న శిక్షణలో శిక్షకులతో ముచ్చటించారు. కలరిపయట్టు విద్య నేర్చుకోవడంతో శారీరక దృఢత్వం, మానసిక ఏకాగ్రత లాంటి అంశాలపై దృష్టి సారించవచ్చన్నారు. కలరిపయట్టు అనేది కేరళలో ఉద్భవించిన ఒక పురాతన భారతీయ యుద్ధ కళ అని శిక్షకుడు రమేశ్ వివరించారు.