News January 26, 2025
తెలంగాణ భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

గణతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామన్నారు.
Similar News
News November 21, 2025
వేగంగా విస్తరిస్తోన్న విశాఖ

GDPలో దేశంలో టాప్-10 నగరాలలో నిలిచిన విశాఖ నగరం వేగంగా విస్తరిస్తొంది. కార్పొరేషన్గా ఉన్న విశాఖపట్నం తరువాత గాజువాక, భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీల విలీనంతో మహా విశాఖ నగర పాలక సంస్థగా ఏర్పడింది. ఇప్పుడు అనకాపల్లి నుంచి విజయనగరం వరకు అభివృద్ధితో వేగంగా దూసుకుపోతోంది. ఒక వైపు భోగాపురం ఎయిర్ పోర్టు, మరోక వైపు డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు వస్తున్నాయి.CII సమ్మిట్లో పెద్ద ఎత్తన పెట్టుబడులు వచ్చాయి.
News November 21, 2025
పత్తి, వేరుశనగలో ఈ ఎర పంటలతో లాభం

☛ పత్తి, వేరుశనగ పంటల్లో ఆముదపు పంటను ఎరపంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను సులభంగా నివారించవచ్చు.
☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్ర గొంగళి పురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు.
☛ వేరుశనగలో పొగాకు లద్దెపురుగు నివారణకు ఆముదం లేదా పొద్దుతిరుగుడు పంటను ఎరపంటగా వేసుకోవాలి. ఎకరానికి 100 మొక్కలను ఎర పంటగా వేసుకోవాలి.
News November 21, 2025
ఇండీ కూటమిని బలోపేతం చేస్తాం: కాంగ్రెస్

ప్రతిపక్ష ఇండీ కూటమిని బలోపేతం చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. బిహార్లో ఘోర ఓటమితో కూటమి మనుగడపై సందేహాలు మొదలైన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చింది. ‘INDIA ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమీ మారలేదు. కూటమిని బలోపేతం చేసేందుకు రెట్టింపు ప్రయత్నాలు చేస్తాం. డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే వింటర్ సెషన్లో ప్రతిపక్షాలు సమన్వయంతో ముందుకు సాగుతాయి’ అని AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు.


