News March 19, 2025

తెలంగాణ రాష్ట్ర జట్టు కెప్టెన్‌గా పాలమూరు వాసి

image

దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టు కెప్టెన్‌గా మక్తల్ పట్టణానికి చెందిన పీడీ బి.రూప ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో ఆమె పాల్గొంటారు. ఎంపికైన రూపను ఉమ్మడి జిల్లా నేతలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు. CONGRATULATIONS.

Similar News

News December 2, 2025

HYD: తెల్లాపూర్ భూములపై రియల్ కన్ను..!

image

కోకాపేట భూముల వేలం ప్రభావం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలపై పడింది. ఇక్కడ ఉండే భూములపై రియల్ నిపుణులు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణానికి ప్రణాళికలు చేస్తున్నారు. దీంతో స్థానికంగా భూముల ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో స్థానికంగా భూయజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మధ్యతరగతి ప్రజలకు ఈ భూములు అందుబాటులో ఉండకపోవడంతో వారు ఆందోళన చెందాల్సి వస్తుంది.

News December 2, 2025

HYD: తెల్లాపూర్ భూములపై రియల్ కన్ను..!

image

కోకాపేట భూముల వేలం ప్రభావం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలపై పడింది. ఇక్కడ ఉండే భూములపై రియల్ నిపుణులు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణానికి ప్రణాళికలు చేస్తున్నారు. దీంతో స్థానికంగా భూముల ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో స్థానికంగా భూయజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మధ్యతరగతి ప్రజలకు ఈ భూములు అందుబాటులో ఉండకపోవడంతో వారు ఆందోళన చెందాల్సి వస్తుంది.

News December 2, 2025

ఆదిలాబాద్: బ్రాండ్ మారింది గురూ…!

image

పంచాయతీ ఎన్నికలు మందు బాబులకు పండగను తీసుకొచ్చాయి. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల నుంచి తమకు నచ్చిన బ్రాండ్ మద్యం అడుగుతున్నారు. కాదంటే మరో వర్గంలో చేరిపోతామని తేల్చి చెబుతున్నారు. దీంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. నిన్నటితో పాత మద్యం దుకాణాల గడువు పూర్తి కావడంతో ఆదివారం సరిపడా స్టాక్ దొరకలేదు. మందు బాబులు అడిగిన బ్రాండ్ దొరకకపోవడంతో సర్పంచ్ అభ్యర్థులు ఎక్కువ ఖర్చు పెట్టి మరి తెప్పించారు.