News March 19, 2025
తెలంగాణ రాష్ట్ర జట్టు కెప్టెన్గా పాలమూరు వాసి

దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టు కెప్టెన్గా మక్తల్ పట్టణానికి చెందిన పీడీ బి.రూప ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో ఆమె పాల్గొంటారు. ఎంపికైన రూపను ఉమ్మడి జిల్లా నేతలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు. CONGRATULATIONS.
Similar News
News November 27, 2025
WGL: తొలి రోజు 705 నామినేషన్లు

ఉమ్మడి WGLలో తొలి రోజు సర్పంచ్ స్థానాలకు 467, వార్డు స్థానాలకు 238 నామినేషన్లు దాఖలయ్యాయి.
> వరంగల్- 91 సర్పంచ్లకు 101.. 800 వార్డులకు 37
> హనుమకొండలో 69 సర్పంచ్లకు 86.. 658 వార్డులకు 61
> జనగామలో 110 సర్పంచ్లకు 108.. 1,024 వార్డులకు 44
> మహబూబాబాద్లో సర్పంచ్లకు 105, వార్డులకు 41
> ములుగులో 48 సర్పంచ్లకు 22.. 420 వార్డులకు 20
> భూపాలపల్లిలో 82 సర్పంచ్లకు 45.. 712 వార్డులకు 35
News November 27, 2025
సిరిసిల్ల: ‘డిసెంబర్ 3న మహా ధర్నా విజయవంతం చేయండి’

జర్నలిస్టులకు ఇవ్వాల్సిన అక్రిడిటేషన్ కార్డుల జారీలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా డిసెంబర్ 3న హైదరాబాదులో తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని TUWJ (IJU) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యుడు దాసరి దేవేందర్ విజ్ఞప్తి చేశారు. హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు కూడా అందని ద్రాక్షగా మారాయని, జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.
News November 27, 2025
సిరిసిల్ల: నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఆదేశించారు. తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల వద్ద, గంభీరావుపేట మండలం పెద్దమ్మ వద్ద, ముస్తాబాద్ వెంకట్రావు పల్లి వద్ద, వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ వద్ద, బోయినపల్లి మండలం నర్సింగాపూర్ వద్ద, రుద్రంగి మండలం మానాల క్రాస్ రోడ్ వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.


