News December 28, 2024

తెలుగును చిన్నచూపు చూస్తున్నారు: ఎన్వీ రమణ

image

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటివరకు తెలుగుభాషా అభివృద్ధికి ఏ ప్రభుత్వం పనిచేయలేదని సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. విజయవాడ కేబిఎన్‌లో జరుగుతున్న తెలుగు రచయితల మహాసభలో శనివారం ఆయన మాట్లాడారు. ఇతర దేశాలు, రాష్ట్రాలు ప్రాంతీయ భాషకు ప్రాధాన్యత ఇస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం పరాయి భాషకు పట్టం కడుతున్నారన్నారు. ఆంగ్లం ద్వారానే ఉద్యోగాలు వస్తాయన్న అపోహలో ఉన్నారన్నారు.

Similar News

News January 19, 2025

నేడు అమిత్ షా ప్రారంభించనున్న NIDM పూర్తి వివరాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్(NIDM) దక్షిణ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ముందుకురాగా 2015లో గన్నవరం మండలం కొండపావులూరులో రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. 2018 మేలో అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఏపీ విభజన చట్టం-2014 ప్రకారం ఏర్పాటైన ఈ కేంద్ర సంస్థ తాజాగా నిర్మాణం పూర్తి చేసుకోగా నేడు మంత్రి అమిత్‌షా లాంఛనంగా ప్రారంభించనున్నారు. 

News January 19, 2025

పెనమలూరు: బాలికపై లైంగిక దాడికి యత్నించిన ప్రబుద్ధుడు

image

తాడిగడప కంటి ఆసుపత్రి సమీపంలో నివసిస్తున్న నారాయణ(60) తన ఇంటి సమీపంలో నివసిస్తున్న రెండో తరగతి చదివే బాలికపై లైంగిక దాడికి యత్నించడంతో పెనమలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి బాలిక తమ కుక్క పిల్ల కోసం నారాయణ ఇంటి సమీపంలోకి వెళ్లింది. అతడు లైంగిక దాడి చేయబోగా బాలిక తప్పించుకొని వచ్చి తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన శనివారం అతడిని అరెస్ట్ చేశారు.

News January 19, 2025

కేంద్ర మంత్రి అమిత్‌షా పర్యటన షెడ్యూల్ 

image

కేంద్ర మంత్రి అమిత్‌షా గన్నవరం పర్యటన షెడ్యూల్ వివరాలను సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆదివారం ఉదయం 10.45 గంటలకు విజయవాడలోని నోవాటెల్ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించే అమిత్‌షా కొండపావులులోని NIDM ప్రాంగణానికి చేరుకుంటారన్నారు. 11.15కి అక్కడ భవనాలను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం 11.35 గంటలకు NDRF పదో బెటాలియన్ క్యాంపస్‌ను ప్రారంభించి సభలో ప్రసంగిస్తారన్నారు.