News February 13, 2025

తెలుగు రాష్ట్రాలను మద్యం మాఫియా నడిపిస్తోంది: శ్రీనివాస్ గౌడ్

image

కాంగ్రెస్ ప్రభుత్వం బీరుకు రూ.30 నుంచి రూ.40 వరకు ధర పెంచిందని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. BRS హయాంలో నామమాత్రపు ధర పెంచితే గగ్గోలు పెట్టారన్నారు. బీర్ల ధరలు పెంచడం దేనికి సంకేతం.. నాణ్యతలేని బీర్లు తీసుకువస్తున్నారని తెలిపారు. AP, TGలో ఒకేసారి ధరలు పెంచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను మద్యం మాఫియా నడిపిస్తోందని ఆరోపించారు.

Similar News

News March 28, 2025

JNTUలో 70.41% పాస్ అయ్యారు

image

JNTU పరిధిలో ఫిబ్రవరిలో జరిగిన బిటెక్ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్ (R 18 రెగ్యులేషన్)పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. 28,480 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 27,533 విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 19,385 మంది అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించారు. 70.41% పాస్ పర్సంటేజ్ నమోదు అయిందని అధికారులు తెలిపారు. ఫలితాలను JNTUH వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు.

News March 28, 2025

విజయనగరం: డివిజన్ల పనితీరుపై సమీక్ష

image

విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏపీ పోస్టల్ సర్కిల్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీస్(DPS) కె.సంతోష్ నేత గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విశాఖపట్నం రీజియన్ పరిధిలోని విజయనగరం,పార్వతీపురం,అనకాపల్లి,శ్రీకాకుళం డివిజన్ల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పొదుపు, ఇన్సూరెన్స్ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని సత్కరించారు. సూపరింటెండెంట్లు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

News March 28, 2025

IPL: పాపం కావ్య

image

సీజన్ తొలి మ్యాచ్‌లో 286 రన్స్ చేసి భారీగా అంచనాలు పెంచేసిన SRH రెండో గేమ్‌లో చతికిలపడింది. LSG చేతిలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో అభిమానులతో పాటు ఫ్రాంఛైజీ ఓనర్ కావ్యా మారన్ డీలా పడిపోయారు. నిన్న స్టేడియంలో మ్యాచ్ చూస్తూ ఆమె పలికించిన హావభావాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘పాపం కావ్య పాప’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

error: Content is protected !!