News August 20, 2024
తేడావస్తే సుప్రీం కోర్టుకు వెళ్తా: బాలినేని

ఒంగోలులో సోమవారం జరగాల్సిన మాక్పోలింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి బాలినేని స్పందిస్తూ.. తాను వెరిఫికేషన్ ఉంటుందని అనుకున్నానని, మాక్ పోలింగ్ కాదని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్కు లెటర్ ఇచ్చామని అలాగే హైకోర్టుకు వెళ్లామన్నారు. కోర్టు ఇవాళ్టికి వాయిదా వేశారన్నారు. హైకోర్టులో ఏదైనా తేడాలు వస్తే సుప్రీంకోర్టుకు వెళ్తానని బాలినేని స్పష్టం చేశారు.
Similar News
News February 27, 2026
మార్కాపురం జిల్లాలో అధికారి సస్పెండ్

మార్కాపురం జిల్లాలో ఓ ప్రభుత్వ అధికారి సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. పుల్లలచెరువు మండలం చాపలమడుగు పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు ఇచ్చారు. గ్రామ పంచాయతీ నిధులు అక్రమంగా దుర్వినియోగం చేశారనే అభియోగంతో డిప్యూటీ MPDO విచారణ చేపట్టారు. నివేదిక ఆధారంగా శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని MPDOని కలెక్టర్ ఆదేశించారు.
News February 27, 2026
కనిగిరి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు హత్య చేశారు.!

గాలివీడులో <<19248603>>ఈ నెల 17న జరిగిన హత్య కేసులో<<>> నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భూవివాదాలు, అన్నదమ్ముల మధ్య వర్గపోరే ఈ హత్యకు కారణమని డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. ఈ హత్యలో కనిగిరి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి పెద్దారెడ్డి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇతనితో పాటు నిందితులు ప్రొద్దుటూరుకు చెందిన కుళాయప్ప, కనిగిరికి చెందిన తిరుపతి రెడ్డి, విశ్వనాధరెడ్డి, మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
News February 26, 2026
మార్కాపురంలో సీఎంను ఆకట్టుకున్న విద్యార్థిని చిత్రలేఖనం

మార్కాపురం బహిరంగ సభలో ఓ విద్యార్థిని గీసిన చిత్రలేఖనం సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మార్కాపురం జిల్లా చెన్నకేశవ స్వామి గోపురం, సీఎం చిత్రాల అందంగా ఉండడంతో విద్యార్థినిని సీఎం అభినందించారు. ఈ చిత్రలేఖనంలో చాలా అర్థం దాగి ఉందని ప్రజలకు వివరించారు. ఆ దేవుడితో పెట్టుకుంటే పతనం ఖాయమని హెచ్చరించారు.


