News August 20, 2024
తేడావస్తే సుప్రీం కోర్టుకు వెళ్తా: బాలినేని

ఒంగోలులో సోమవారం జరగాల్సిన మాక్పోలింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి బాలినేని స్పందిస్తూ.. తాను వెరిఫికేషన్ ఉంటుందని అనుకున్నానని, మాక్ పోలింగ్ కాదని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్కు లెటర్ ఇచ్చామని అలాగే హైకోర్టుకు వెళ్లామన్నారు. కోర్టు ఇవాళ్టికి వాయిదా వేశారన్నారు. హైకోర్టులో ఏదైనా తేడాలు వస్తే సుప్రీంకోర్టుకు వెళ్తానని బాలినేని స్పష్టం చేశారు.
Similar News
News November 14, 2025
సెల్ ఫోన్ వద్దు – పుస్తకం ముద్దు: ప్రకాశం కలెక్టర్

విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి, పుస్తకాలకు చేరువ కావాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని శాఖ గ్రంథాలయంలో శుక్రవారం జిల్లా గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, మేయర్ గంగాడ సుజాత, పలువురు అధికారులు పాల్గొన్నారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News November 13, 2025
ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప భక్తుడి మృతి

ప్రకాశం జిల్లా పామూరు మండలం ఇనిమెర్ల ఎస్సీ పాలెం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఆటో ఢీకొట్టింది. పామూరు పట్టణంలోని ఆకుల వీధికి చెందిన అయ్యప్ప మాల ధరించిన చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోలో ఉన్న మరికొందరికి గాయాలైనట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News November 13, 2025
విద్యుత్తు అధికారులు నిర్లక్ష్యంగా ఉండరాదు: CMD

ఒంగోలులోని విద్యుత్ భవన్లో APSPDCL సీఎండీ పుల్లారెడ్డి గురువారం కీలక సమావేశం నిర్వహించారు. ఆర్డీఎస్ఎస్, పీఎం సూర్య ఘర్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, స్మార్ట్ మీటర్ల గురించి చర్చించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయరాదని అధికారులకు సూచించారు. జిల్లాలో సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్లు అధికంగా ఏర్పాటు చేసేలా ప్రతి అధికారి ఓ లక్ష్యాన్ని పెట్టుకోవాలన్నారు.


