News September 28, 2024
తేలినీలాపురంలో విదేశీ పక్షుల సందడి
టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామంలో విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. ప్రతిఏటా సైబీరియా నుంచి సెప్టెంబర్ నెలాఖరుకు వచ్చే ఈ విదేశీపక్షులు ఏప్రిల్ వరకు ఇక్కడ విడిది కేంద్రంలో విడిది చేస్తాయి. పెలికాన్, పెయింటెడ్ స్టార్క్స్ అనే రెండు రకాల పక్షులు సుదూర తీరాలు దాటి టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామానికి వచ్చి ఇక్కడ చింత చెట్లపై నివసిస్తాయి. అటవీశాఖ అధికారులు వాటిని పర్యవేక్షిస్తారు.
Similar News
News September 29, 2024
షూటింగ్ పోటీల్లో టెక్కలి విద్యార్థిని ప్రతిభ
సౌత్ జోన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో టెక్కలి మండలం తిర్లంగి గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని వజ్జ ప్రణవి ప్రతిభ కనబరిచింది. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు జరిగిన సీబీఎస్ఈ అండర్-14 షూటింగ్ పోటీల్లో వెండి పథకం సాధించింది. ఎయిర్ రైఫిల్ లో 400 షూట్లకు గాను 391 పాయింట్లు సాధించింది. అక్టోబర్ 21 నుంచి 25 వరకు భోపాల్ లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది.
News September 29, 2024
శ్రీకాకుళం: భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు
దసరా పండగ ముంగిట నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. నూనె లీటర్ పై రూ.20-45 వరకు, వెల్లుల్లి కిలో రూ.300 నుంచి రూ.360, అల్లం రూ.100 నుంచి రూ.150, ఎండుమిర్చి రూ.200 నుంచి రూ.240, పెసరపప్పు రూ.150, మినపప్పు రూ.135, కందిపప్పు రూ.150 నుంచి 175కు పెరిగాయి. ఉల్లి కేజీ రూ.60కి తగ్గడం లేదు. ధరలు భారీగా పెరగడంతో ఏదీ కొనలేక పోతున్నామని ప్రజలు అంటున్నారు.
News September 29, 2024
శ్రీకాకుళం జిల్లాలో భారీగా సీఐలు బదిలీ
విశాఖ రేంజ్లో 14 మంది సీఐలుకు శనివారం రాత్రి బదిలీలు జరిగాయి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాకు ఐదుగురు సీఐలు రానున్నారు. పాతపట్నం సీఐ నల్లి సాయిని విశాఖ వీఆర్కు బదిలీ చేస్తూ డీఐజీ గోపీనాథ్ జట్టి ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ రేంజ్ లో ఉన్న సీఐలు..శ్రీనివాసరావు(డీసీఆర్బీ), కృష్ణారావు (టాస్క్ ఫోర్స్), సూర్యచంద్రమౌళి (సీసీఎస్), ఎం.కృష్ణమూర్తి (డీటీసీ), వానపల్లి రామారావు (పాతపట్నం) స్థానాలకు వస్తున్నారు.