News January 28, 2025

తొండంగి గ్యాస్ సిలిండర్ల గోడౌన్‌లో చోరీ

image

మండలం కేంద్రం తొండంగి గ్రామంలో వైష్ణోదేవి గ్యాస్ ఏజెన్సీ గోడౌన్‌లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. పోలీసుల వివరాలు ప్రకారం 96 డొమెస్టిక్ సిలిండర్లు అపహరణకు గురైనట్టు నిర్వాహకుడు వడ్డాది ప్రసాద్ పేర్కొన్నాడు. వాటి విలువ 3.5 లక్షలు ఉంటుందని నిర్వహకుడు ప్రసాద్ సోమవారం అన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై జగన్మోహన్ మాట్లాడుతూ.. కేసు నమోదు చేసామని ఘటనపై దర్యాప్తు వేగవంతం చేస్తామన్నారు.

Similar News

News October 26, 2025

తాండూరు: ‘ఈనెల 30వరకు అడ్మిషన్లకు అవకాశం’

image

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓపెన్ పదో తరగతి, ఇంటర్ అడ్మిషన్స్‌కు ఈనెల 30వరకు అవకాశం ఉందని, వివిధ కారణాలతో మధ్యలో చదువు మానేసినవారు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాండూరు నంబర్ వన్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శివకుమార్ తెలిపారు. అడ్మిషన్ల పూర్తి వివరాలకు పాఠశాల ఓపెన్ స్కూల్ ఇన్ఛార్జ్ మహేష్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.

News October 26, 2025

ఉమ్మడి విశాఖలో రూ.220 కోట్ల బకాయిలు

image

జిల్లా గ్రంథాలయ సంస్థకు ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థలు రూ.220 కోట్లు సెస్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 67 గ్రంథాలయాలు ఉన్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీలు, జీవీఎంసీ వసూలు చేసే ఇంటి పన్నుల్లో గ్రంథాలయ సెస్ కూడా ఉంటుంది. జీవీఎంసీ రూ.200 కోట్లు పైగా చెల్లించాల్సి ఉంది. సెస్ బకాయిల వసూళ్లకు కృషి చేస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్ రాజా తెలిపారు.

News October 26, 2025

తుఫాను వేళ ఎండ.. దేనికి సంకేతమో తెలుసా?

image

AP: ఇవాళ 8-9AM మధ్య పార్వతీపురం జిల్లాలో గరిష్ఠంగా 34.7, NTR జిల్లాలో 34.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం సమయానికి మరో 2-3 డిగ్రీల టెంపరేచర్‌ పెరిగే అవకాశం ఉంది. మొంథా తుఫాన్ ఏపీకి 800 KM దూరంలో ఉండటంతో ఆ ప్రభావం ఇప్పుడే కనిపించదని, 300 KMల దగ్గరకు చేరగానే వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. ఇవాళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే భూమి వేడెక్కి తుఫాన్‌ ప్రభావం అధికమవుతుందని చెప్పారు.