News February 28, 2025
తొండింగి: పీక కోసుకొని యువకుడి ఆత్మహత్య

తొండింగి మండలంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తమ్మయ్య పేటలో భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో భర్త పీక కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ జగన్మోహన్ తెలిపిన వివరాలు.. కిర్లంపూడి(M) రామచంద్రపురానికి చెందిన కుందేటి లోవరాజు (28) భార్య నాగలక్ష్మికి తరచూ గొడవలు నేపథ్యంలో మనస్థాపం చెంది ఇంటిపై వాటర్ ట్యాంకు వద్ద పీక కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ తెలిపారు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
Similar News
News December 3, 2025
వేములవాడ: రాజన్న ఆలయాభివృద్ధి.. ‘ఆఫీసర్లపై ఆంక్షలు’

వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ, ముఖ్యంగా ఇంజినీరింగ్ పనులకు సంబంధించి ఆయా అధికారులు అస్సలు నోరు విప్పడం లేదట. డెవలెప్మెంట్ పనులు, పురోగతికి సంబంధించి ఎటువంటి సమాచారం మీడియాకు లీక్ చేయొద్దనే ఆంక్షలను ఆఫీసర్లపై విధించారట. దీంతో ఆలయాభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారమేదీ పక్కాగా బయటకు రావడంలేదు. కాగా, ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి సంబంధించి ఏ చిన్న విషయమైన తెలుసుకోవాలని ప్రతి భక్తుడికి సాధారణంగా ఉంటుంది.
News December 3, 2025
అంబేడ్కర్ భవన్లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా హనుమకొండ అంబేడ్కర్ భవన్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దివ్యాంగుల విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఉపకార వేతనాలు, సబ్సిడీ రుణాలు వంటి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఈ సందర్భంగా వారి హక్కులు, అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
News December 3, 2025
అమరావతికి రాజధాని హోదా.. కేంద్రం సవరణ బిల్లు

AP: అమరావతిని అధికారికంగా రాజధానిగా ప్రకటించేందుకు కేంద్రం సవరణ బిల్లును తీసుకొస్తోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణ ద్వారా అమరావతిని స్పష్టంగా రాజధానిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి న్యాయశాఖ ఆమోదం లభించిందని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ ఆమోదం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీచేస్తే అమరావతి రాజధాని హోదాకు చట్టబద్ధత ఏర్పడుతుంది.


