News January 7, 2025
తొండూరులో తల్లీ, కూతురు దారుణ హత్య
పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం తుమ్మలపల్లిలో సోమవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగాధరరెడ్డి మద్యం మత్తులో భార్య శ్రీలక్ష్మి (37), కుమార్తె గంగోత్రి (14)లను గొంతులు కోసి హతమార్చినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 24, 2025
పులివెందులకు ఉప ఎన్నికలు ఖాయం: బీటెక్ రవి
వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడం చూస్తుంటే, పులివెందులకు ఉప ఎన్నికలు రావడం ఖాయంగా కనపడుతోందని పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. రాజకీయాలకు విజయ్ సాయిరెడ్డి రాజీనామా చేశారంటే అప్రూవర్గా మారడం ఖాయమన్నారు. ఇక జగన్ డిస్ క్వాలిఫై అవుతారని, పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ఖాయమంటూ ట్వీట్ చేశారు.
News January 24, 2025
కడప: ‘ఆ ఉద్యోగిని సర్వీస్ నుంచి తొలగించండి’
కడప జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎ.చంద్రశేఖర్ రెడ్డిని ఉద్యోగం నుంచి తక్షణం తొలగించి.. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ నగర కార్యదర్శి ఎన్.వెంకట శివ డిమాండ్ చేశారు. మహిళా అధికారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన డీటీసి చంద్రశేఖర్కు వ్యతిరేకంగా కడప ఆర్టీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. లైంగిక వేధింపులకు పాల్పడటం దారుణమన్నారు.
News January 24, 2025
కడప: మహిళా ఉద్యోగిపై వేధింపులు.. చర్యలు తప్పవు
కడప రవాణా శాఖ కార్యాలయంలో మహిళా ఉద్యోగిపై డీటీసీ చంద్రశేఖర్ వేధింపుల పట్ల అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఉన్నతాధికారులు, జాయింట్ రవాణా కమిషనర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో శుక్రవారం కడప రవాణా శాఖ కార్యాలయంలో స్వయంగా బాధిత మహిళా ఉద్యోగితో మాట్లాడారు. అనంతరం ఘటనపై ప్రత్యేకంగా విచారించారు. కార్యాలయంలోని సీసీ కెమెరాలు స్వయంగా పరిశీలించి డీటీసీ చంద్రశేఖర్పై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.