News February 16, 2025

తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి ఎంపీ

image

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటనపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆదివారం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో ప్రాణ నష్టం జరగడం అత్యంత బాధాకరంగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.పది లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించిందని అన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

Similar News

News October 31, 2025

2018లోనే జెమీమా ప్రతిభను గుర్తించిన ENG మాజీ కెప్టెన్

image

మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్‌లో అద్భుతంగా రాణించిన ఇండియన్ ఉమెన్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ పేరు మార్మోగుతోంది. అయితే ఈమె స్టార్‌గా ఎదుగుతారని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ 2018లో చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరలవుతోంది. ‘ఈ పేరు గుర్తుంచుకోండి.. జెమీమా రోడ్రిగ్స్. ఇండియాకు స్టార్‌గా మారుతుంది’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ అంచనా నిజమైందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

News October 31, 2025

రాయలసీమ వర్సిటీలో కత్తితో బీటెక్‌ విద్యార్థి హల్‌చల్‌

image

కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయం హాస్టల్‌లో గురువారం రాత్రి ఓ విద్యార్థి కత్తి పట్టుకొని హల్‌చల్ చేశాడు. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు అజయ్ నాయక్, బాలాజీ నాయక్‌ల మధ్య ఘర్షణ జరగ్గా అజయ్ కత్తి పట్టుకొని బాలాజీ రూమ్ వద్దకు వెళ్లి బెదిరించాడు. వర్సిటీ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని గొడవను అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయం తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కాగా సీఐ దర్యాప్తు చేస్తున్నారు.

News October 31, 2025

విజయనగరంలో పోలీసుల క్యాండిల్ ర్యాలీ

image

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా విజయనగరంలో ఘనంగా కాండిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వరకు ర్యాలీ కొనసాగింది. ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ..దేశ భద్రత, శాంతి కాపాడడంలో ప్రాణాలను అర్పించిన పోలీసు అమర వీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అన్నారు. పోలీసు విధుల్లో తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరులకు జోహార్లు తెలిపారు.