News March 24, 2025
తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

సూర్యాపేట(D) బీబీగూడెం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొర్రూరు మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆత్మకూరు(ఎస్) మండలం కోటపహాడ్లో శుభకార్యానికి కంటాయపాలెంకు చెందిన గడ్డం రవీందర్ (34), ఆయన భార్య రేణుక (28), కుమార్తె రిషిత(8) వెళ్లారు. తిరిగి HYD వెళ్తుండగా బస్సు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Similar News
News November 17, 2025
పెద్దపల్లిలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష

పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ సోమవారం మినీ సమావేశ మందిరంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై విస్తృత సమీక్ష నిర్వహించారు. నవజాత శిశువుల వారోత్సవాలు, వెసెక్టమీ పక్షం కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. క్షయ నిర్ధారణ, జ్వరాల సర్వే, డ్రై డే కార్యక్రమాలు కొనసాగించాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఓపీ కేసులు, సిబ్బంది సమయపాలనపై దృష్టి పెట్టి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని ఆమె సూచించారు.
News November 17, 2025
పెద్దపల్లిలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష

పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ సోమవారం మినీ సమావేశ మందిరంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై విస్తృత సమీక్ష నిర్వహించారు. నవజాత శిశువుల వారోత్సవాలు, వెసెక్టమీ పక్షం కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. క్షయ నిర్ధారణ, జ్వరాల సర్వే, డ్రై డే కార్యక్రమాలు కొనసాగించాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఓపీ కేసులు, సిబ్బంది సమయపాలనపై దృష్టి పెట్టి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని ఆమె సూచించారు.
News November 17, 2025
సమస్య పరిష్కారంలో జాప్యం ఉండకూడదు: మహబూబాబాద్ కలెక్టర్

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోతోపాటు IDOCలో ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.


