News August 5, 2024
తొర్రూర్లో స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
ఓ స్కూల్ బస్సుకు ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు.. తొర్రూరులోని ఆర్యభట్ట స్కూల్కు చెందిన బస్సు ఈరోజు చెర్లపాలెం, గోపాలగిరి గ్రామాలకు చెందిన విద్యార్థులను ఎక్కించుకొని స్కూలుకు బయలుదేరి వస్తుండగా చీకటాయపాలెం వద్ద చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. అక్కడే ఉన్న ఓ చెట్టును ఢీకొట్టగా, విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా స్కూల్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News October 1, 2024
నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా
వరంగల్ జిల్లా క్రిస్టియన్ కాలనీలోని సీబీసీ చర్చి నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు. అనంతరం మంత్రి దంపతులను పలువురు సభ్యులు ఘనంగా సన్మానించారు.
News October 1, 2024
WGL: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!
సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు ఆలోచనలో పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.
News October 1, 2024
వరంగల్: మార్కెట్లో పత్తి ధరల వివరాలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర తటస్తంగా ఉంది. సోమవారం క్వింటా పత్తి ధర రూ. 7450 పలకగా… నేడు కూడా అదే ధర పలికింది. అలాగే ఈరోజు మార్కెట్ తరలిరాగా రూ. 6910 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే గత వారంతో పోలిస్తే ధరలు పడిపోయాయని వ్యాపారులు తెలుపుతున్నారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది.