News October 1, 2024

తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసుకుంటాం: స్టీల్ ప్లాంట్ అధికారులు

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ED ఆఫీస్ దగ్గర కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న ధర్నాకి యాజమాన్యం దిగొచ్చింది. తొలగించిన 4290 మంది కాంట్రాక్ట్ కార్మికులకు బయోమెట్రిక్ గేట్ పాసులు యథావిధిగా కొనసాగిస్తామని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మంగళవారం రాత్రి హామి ఇచ్చింది. లిఖిత పూర్వకంగా తమకు హామీ ఇచ్చినట్లు యూనియన్ నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు వెల్లడించారు.

Similar News

News October 2, 2024

విశాఖ జిల్లాలో 1,58,224 మందికి పెన్షన్ పంపిణీ

image

విశాఖ జిల్లాలో మంగళవారం సాయంత్రం వరకు 97.39 శాతం పెన్షన్ లబ్ధిదారులకు అందజేసినట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు 1,58,244 మందికి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా సెలవు కావడంతో 3వ తేదీన మిగిలిన లబ్ధిదారులకు పెన్షన్ నగదును పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.

News October 1, 2024

విశాఖలో అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్

image

విశాఖ నగరంలోని ముడసర్లోవ ఈస్ట్ పాయింట్ గోల్డ్ క్లబ్ మరో అంతర్జాతీయ గోల్డ్ టోర్నమెంటుకు వేదికయ్యింది. ఈ మేరకు మంగళవారం నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యంత ప్రతిష్టాత్మక ది ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) పేరుతో రెండు నుంచి 5వ తేదీ వరకు టోర్నమెంట్ నిర్వహించనుంది. ఈ పోటీలో దేశ విదేశాల నుంచి క్రీడాకారులు పాల్గొనున్నారు. విజేతలకు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

News October 1, 2024

రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది..?: బొత్స

image

ఆంధ్ర రాష్ట్రంలో అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మంగళవారం విశాఖ వైసీపీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. మద్యంపై దృష్టి పెట్టి పెద్ద స్థాయిలో ప్రచారం చేస్తోందని అన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.